
సినిమాలో స్టార్ డమ్ తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిన వారు కొందరు ఉంటే మరికొంతమంది వరుస సినిమాలతో హిట్స్ అందుకుంటూ స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. హీరోలు మాత్రమే కాదు హీరోయిన్స్ కూడా స్టార్స్ గా రాణిస్తున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోయిన్స్ ఉన్నారు. అయితే కొంతమంది హీరోయిన్స్ మాత్రం ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నా సరైన గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నారు.

ఇదిలా ఉంటే ఓ హీరోయిన్ ఇండస్ట్రీలో స్టార్ డమ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. కొంతమంది డబ్బులిచ్చి స్టార్ డమ్ కొంటున్నారు అని చెప్పి షాక్ ఇచ్చింది ఆ అందాల భామ.. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఇండస్ట్రీలో ఆమె చాలా పాపులర్ హీరోయిన్. ఎంతో మంది హీరోలతో కలిసి నటించింది. ఆమె మరెవరో కాదు.. తన అందం, నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ముద్దుగుమ్మ అమీషా పటేల్.

ఒకప్పుడు ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలింది. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఈ ముద్దుగుమ్మ ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి హిట్స్ అందుకుంది. తెలుగు ప్రేక్షకులకు కూడా అమీషా పటేల్ సుపరిచితురాలే.. సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లతో కలిసి నటించింది ఈ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం అమీషా పటేల్ సినిమాల స్పీడ్ తగ్గించింది. మొన్నామధ్య బాలీవడు లో గదర్-2లో నటించి హిట్ అందుకుంది. ఇదిలా ఉంటే తాజాగా అమీషా పటేల్ ఇండస్ట్రీలో పీఆర్ స్టంట్ పై ఫైర్ అయింది.. కొంతమంది స్టార్ డమ్ ను డబ్బుల్చి కొంటున్నారని ఆమె చెప్పుకోచ్చింది.. అలాగే కొంతమంది నటించిన సినిమాాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రాభావం చూపించకపోయిన తమనుతాము స్టార్స్ గా చెప్పుకుంటుంన్నారని అమీషా పటేల్ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేసింది.

సినిమాల్లో నటించిన వారందరూ, షూటింగ్ సెట్ లో ఉన్నవారందుకు స్టార్స్ అయిపోరు. మీ పీఆర్ టీమ్స్కు డబ్బులు ఇచ్చి నెంబర్ 1, నెంబర్ 2 అని పిలిపించుకుంటే సూపర్ స్టార్లు అయిపోరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రూ. 100కోట్ల కలెక్షన్స్ అనేవి చాల కామాన్ అయ్యాయి. కనీసం రూ. 200 కోట్లు వసూల్ చేస్తున్నాయి సినిమాలు. ఇలాంటి పెద్ద సినిమాల్లో లేని వారు కూడా తమను తాము స్టార్స్ అని చెప్పుకుంటున్నారు.