
ఒకప్పుడు తెలుగులో తోపు హీరోయిన్. అప్పట్లో కుర్రాళ్ల ఆరాధ్య దేవత. పవన్ కళ్యాణ్, రవితేజ వంటి స్టార్ హీరోలతో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ఇప్పుడు దాదాపు 11 ఏళ్లకు రీఎంట్రీ ఇస్తుంది.

ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ మీరా జాస్మిన్. దక్షిణాదిలో తోపు హీరోయిన్. ఫిబ్రవరి 15, 1982న కేరళలో జన్మించారు. అందం, అభినయంతో సినీరంగంలో తనదైన ముద్ర వేసింది. 2001లో "సూత్రధరన్" చిత్రంతో తన కెరీర్ను ప్రారంభించింది.

2003లో విడుదలైన "కస్తూరిమాన్" చిత్రంతో ఆమెకు నిజమైన గుర్తింపు వచ్చింది. ఈ చిత్రం ఆమెను రాత్రికి రాత్రే స్టార్గా మార్చింది. తెలుగులో భద్ర, గుడుంబా శంకర్ వంటి చిత్రాలతో తెలుగులో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.

"పదం ఒన్ను: ఒరు విలాపం" చిత్రంలో తన అద్భుతమైన నటనకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన ఆమె ఇటీవలే రీఎంట్రీ ఇచ్చింది.

11 సంవత్సరాల తర్వాత ఆమె తమిళ సినిమాకు రీఎంట్రీ ఇచ్చింది. ఆమె దుబాయ్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైటస్ను వివాహం చేసుకుంది. అయితే ఇప్పటివరకు తన వైవాహిక బంధం గురించి బయటపెట్టడం లేదు.