పశ్చిమ బెంగాల్.. మరో వారం రోజులపాటు పాక్షిక లాక్ డౌన్

పశ్చిమ బెంగాల్ లోని కంటెయిన్మెంట్ జోన్లలో మరో వారం రోజులపాటు పాక్షిక లాక్ డౌన్ విధించాలని మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నందున ఈ చర్య తీసుకున్నట్టు..

పశ్చిమ బెంగాల్.. మరో వారం రోజులపాటు పాక్షిక లాక్ డౌన్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 09, 2020 | 5:27 PM

పశ్చిమ బెంగాల్ లోని కంటెయిన్మెంట్ జోన్లలో మరో వారం రోజులపాటు పాక్షిక లాక్ డౌన్ విధించాలని మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నందున ఈ చర్య తీసుకున్నట్టు సీఎం మమత వెల్లడించారు. ఈ ఆంక్షలను అతిక్రమించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను ఆదేశించారు. ఏడు రోజుల అనంతరం పరిస్థితిని సమీక్షించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఈ వారం రోజుల్లో రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిన పక్షంలో సడలింపులు ఉంటాయని ఆమె చెప్పారు. బుధవారం ఒక్కరోజే పశ్చిమ బెంగాల్ లో 986 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో మొత్తం కేసుల సంఖ్య 24,823 కి పెరిగింది.