‘మేము గల్లీ ఫ్యాక్షన్ అయితే, నీవు ఢిల్లీ స్థాయిలో రేపిస్ట్ అయ్యావు’.. హిందూపురం ఎంపీ మాధవ్ పై పరిటాల శ్రీరామ్ ఫైర్.!

అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పై టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 'నీ మీద ఉన్న రేప్, మర్డర్ కేసులు ఫస్ట్ చూసులో..

‘మేము గల్లీ ఫ్యాక్షన్ అయితే, నీవు ఢిల్లీ స్థాయిలో రేపిస్ట్ అయ్యావు’.. హిందూపురం ఎంపీ మాధవ్ పై పరిటాల శ్రీరామ్ ఫైర్.!
Follow us

|

Updated on: Dec 10, 2020 | 9:04 PM

అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పై టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘నీ మీద ఉన్న రేప్, మర్డర్ కేసులు ఫస్ట్ చూసులో.. తర్వాత మా గురించి మాట్లాడు’. అంటూ విమర్శలు గుప్పించారు. “మాధవ్ అన్న.. తన గత చరిత్రను తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఫ్యాక్షన్ చేసి పరిటాల రవి రాలేదు.. అనంత ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడేందుకు ఫ్యాక్షన్ జరిగింది.. నిజాలు మాట్లాడితే మంచిది. ఎస్ ఐ గా ఉన్న నువ్వు ఏం చేశావు. మేము గల్లీ ఫ్యాక్షన్ అయితే, నీవు ఢిల్లీ స్థాయిలో రేపిస్ట్ అయ్యావు… నీ మీద ఉన్న రేప్, మర్డర్ కేసులు ఫస్ట్ చూసులో.. తర్వాత మా గురించి మాట్లాడు. ప్రకాష్ రెడ్డి అబద్దాలు చెప్పి ఎమ్మెల్యే అయ్యాడు… మంచి చేస్తే ప్రజలు హర్షిస్తారు. అధికారంలో ఉన్నావు.. పనిచేసి చూపించు.” అంటూ పరిటాల శ్రీరామ్, ఎంపీ మాధవ్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ హయాంలో చేసిన పనులను తాము చేసినట్టు కొత్తగా చూపుతున్నారని పరిటాల ఎద్దేవా చేశారు.  కొత్త పనులకు ప్రభుత్వం టెండర్లు ఎందుకు పిలవడం లేదో దమ్ముంటే చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పుట్టకనుమ ప్రాజెక్టును ఆపి కొత్తవి చేయడం సరికాదన్నారు. “ప్రాజెక్టు పేరు మార్చారు.. మీ చేతిలో ఉంది చేశారు.. మా టైం వస్తుంది”. అని శ్రీరామ్ అన్నారు. “పుట్టకనుమ ప్రాజెక్టు రద్దు చేసి మూడు కడతాం అంటున్నారు. ఎందుకు టెండర్ పిలవలేదు. అదే కాంట్రాక్టర్లు పనులు చేస్తున్నారు.. ఎంత మిగిలింది… ఎవరి వాటా ఎంత.. అదికూడా చెప్పండి.” అంటూ ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.