పాక్ మరో కీలక నిర్ణయం..
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావెద్ బాజ్వా పదవీకాలాన్ని పొడగించింది. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ నిర్ణయం మేరకు.. బాజ్వా పదవీకాలాన్ని మరో మూడేళ్లు పొడిగిస్తున్నట్లు పీఎంవో కార్యాలయంలో ఓ ప్రకటనలో పేర్కొన్నది. ప్రాంతీయ భద్రతా వాతవరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీఎంవో వెల్లడించింది. పీఎంవో విడుదల చేసిన నొటిఫికేషన్పై ఇమ్రాన్ ఖాన్ సంతకం చేశారు. కాగా, ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని ఆర్మీ చీఫ్ జావెద్ భజ్వా తీవ్రంగా […]
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావెద్ బాజ్వా పదవీకాలాన్ని పొడగించింది. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ నిర్ణయం మేరకు.. బాజ్వా పదవీకాలాన్ని మరో మూడేళ్లు పొడిగిస్తున్నట్లు పీఎంవో కార్యాలయంలో ఓ ప్రకటనలో పేర్కొన్నది. ప్రాంతీయ భద్రతా వాతవరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీఎంవో వెల్లడించింది. పీఎంవో విడుదల చేసిన నొటిఫికేషన్పై ఇమ్రాన్ ఖాన్ సంతకం చేశారు.
కాగా, ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని ఆర్మీ చీఫ్ జావెద్ భజ్వా తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే. కశ్మీరీలకు పాకిస్తాన్ అండంగా ఉంటుందని ఆయన గతంలో చెప్పారు. కశ్మీరీల స్వాతంత్ర్య పోరాటానికి పాకిస్తాన్ ఆర్మీ మద్దతు ఇస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆయన పదవీ కాలాన్ని మూడేళ్ల పాటు పెంచడం.. ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇండియా-పాకిస్తాన్ మధ్య తాజా పరిస్థితుల దృష్యా వ్యూహాత్మకంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.