బ్రేకింగ్: సీఏఏ… ‘ అభ్యంతరాలున్నాయ్ ‘ నితీష్ కుమార్ షాకింగ్ ప్రకటన !
వివాదాస్పదమైన సీఏఏపై మొట్టమొదటిసారిగా బీజేపీ మిత్రపక్షమైన జేడీ-యు అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ షాకింగ్ ప్రకటన చేశారు. ఈ చట్టంపై తమ రాష్ట్ర అసెంబ్లీలో డిబేట్ జరగవలసి ఉందని అన్నారు. ఈ మేరకు శాసన సభలో అధికారిక ప్రకటన చేశారు. పార్లమెంటులో తమ పార్టీ ఈ చట్టంపై ప్రభుత్వానికి మద్దతు తెలిపినప్పటికీ.. నితీష్ వైఖరిలో మార్పు వచ్చినట్టు ఉంది. అలాగే ఎన్నార్సీని బీహార్లో అమలు చేసే ప్రసక్తి గానీ, ఆ అవసరం గానీ లేదని కూడా […]
వివాదాస్పదమైన సీఏఏపై మొట్టమొదటిసారిగా బీజేపీ మిత్రపక్షమైన జేడీ-యు అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ షాకింగ్ ప్రకటన చేశారు. ఈ చట్టంపై తమ రాష్ట్ర అసెంబ్లీలో డిబేట్ జరగవలసి ఉందని అన్నారు. ఈ మేరకు శాసన సభలో అధికారిక ప్రకటన చేశారు. పార్లమెంటులో తమ పార్టీ ఈ చట్టంపై ప్రభుత్వానికి మద్దతు తెలిపినప్పటికీ.. నితీష్ వైఖరిలో మార్పు వచ్చినట్టు ఉంది.
అలాగే ఎన్నార్సీని బీహార్లో అమలు చేసే ప్రసక్తి గానీ, ఆ అవసరం గానీ లేదని కూడా ఆయన చెప్పారు. నిండు సభలో నితీష్ కుమార్ అధికారికంగా ఈ స్టేట్ మెంట్ చేయడం ఆశ్చర్యకరం. ‘ సవరించిన పౌరసత్వ చట్టంపై మొదట చర్చ జరగాలి.. ప్రజలు కోరితే అప్పుడు ఈ సభలో దీనిపై చర్చ జరుగుతుంది. ఇక ఎన్నార్సీ సంబంధించి దీన్ని రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదు.. ఆ అవసరం కూడా లేదు ‘ అని ఆయన అన్నారు. అటు-జేడీ-యు ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ కూడా ఆదివారం ఇలాగే ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ చట్టాల విషయంలో తమ పార్టీ అధినేత వైఖరికి నిరసనగా ఆయన రాజీనామాకు కూడా సిధ్ధపడుతూ ట్వీట్లు చేశారు.
While supporting #CAB, the JDU leadership should spare a moment for all those who reposed their faith and trust in it in 2015.
We must not forget that but for the victory of 2015, the party and its managers wouldn’t have been left with much to cut any deal with anyone.
— Prashant Kishor (@PrashantKishor) December 11, 2019