రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ సతీమణికి అరుదైన గౌరవం..
ప్రముఖ విద్యావేత్త, బిజినెస్ వుమెన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీకి అరుదైన గౌరవం దక్కింది. తరచూ సేవా కార్యక్రమాల్లో ముందుండే ఆమె.. న్యూయార్క్లోని అతిపెద్ద మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ బోర్డుకు గౌరవ ధర్మకర్తగా ఎంపికయ్యారు. దేశ కళలు, సంస్కృతిని విశ్వవ్యాప్తంగా ప్రోత్సహిస్తున్నందుకు గానూ ఆమెకు ఈ అరుదైన గౌరవం లభించింది. మంగళవారం జరిగిన బోర్డు సమావేశంలో మ్యూజియం ఛైర్మన్ డేనియల్ బ్రాడ్స్కీ నీతా అంబానీని గౌరవ ధర్మకర్తగా ఎంపిక చేసినట్లు […]
ప్రముఖ విద్యావేత్త, బిజినెస్ వుమెన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీకి అరుదైన గౌరవం దక్కింది. తరచూ సేవా కార్యక్రమాల్లో ముందుండే ఆమె.. న్యూయార్క్లోని అతిపెద్ద మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ బోర్డుకు గౌరవ ధర్మకర్తగా ఎంపికయ్యారు. దేశ కళలు, సంస్కృతిని విశ్వవ్యాప్తంగా ప్రోత్సహిస్తున్నందుకు గానూ ఆమెకు ఈ అరుదైన గౌరవం లభించింది. మంగళవారం జరిగిన బోర్డు సమావేశంలో మ్యూజియం ఛైర్మన్ డేనియల్ బ్రాడ్స్కీ నీతా అంబానీని గౌరవ ధర్మకర్తగా ఎంపిక చేసినట్లు ప్రకటించారు. ఈ గౌరవం దక్కిన తొలి తొలి భారతీయురాలు నీతా అంబానీనే.
సమావేశంలో భాగంగా మ్యూజియం ఛైర్మన్ డేనియల్ మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, కళలను విశ్వవ్యాప్తం చేయడంలో ఆమె చేస్తున్న కృషి అనిర్వచనీయమైందని.. ఆమె మద్దతుతో ప్రపంచం నలుమూలల ఉన్న కళల గురించే అధ్యయనం చేసే సామర్థ్యం ఈ మ్యూజియంకు లభించిందన్నారు. ఇక రిలయన్స్ ఫౌండేషన్ (సేవా సంస్థ)కు కూడా నీతా అంబానీ ఛైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు. ఈ ఫౌండేషన్ 2016 సంవత్సరం నుంచి మెట్రోపాలిటన్ ఆర్ట్ మ్యూజియంకు మద్దతు తెల్పుతోంది. ఈ మ్యూజియంలో ప్రతి ఏటా ప్రత్యేక షోలను నీతా అంబానీ నిర్వహిస్తున్నారు.