మహేష్ ఫ్యాన్స్కి గుడ్న్యూస్.. ‘సరిలేరు నీకెవ్వరు’లో కొత్త సీన్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, కామెడీ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. కాగా..ఈ నెల 11వ తేదీన విడుదలైన ఈ చిత్రం.. ఇప్పటికీ విజయవంతంగా దూసుకువెళ్తుంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. అయితే ఈ సినిమాలో మరికొన్ని కొత్త సీన్లను యాడ్ చేస్తున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. తెలుగు సినిమాకి […]
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, కామెడీ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. కాగా..ఈ నెల 11వ తేదీన విడుదలైన ఈ చిత్రం.. ఇప్పటికీ విజయవంతంగా దూసుకువెళ్తుంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. అయితే ఈ సినిమాలో మరికొన్ని కొత్త సీన్లను యాడ్ చేస్తున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. తెలుగు సినిమాకి సంక్రాంతి కళ వచ్చిందంటూ ఆయన సంతోషం వ్యక్తం చేశారు. నిజానికి సినిమా లెన్త్ ఎక్కువ అవడం వల్ల కొన్ని సీన్స్ని కట్ చేశామని అవి ఈ శుక్రవారం నుంచి సినిమాలో జోడిస్తామని చెప్పారు అనిల్.
కాగా.. ఈ చిత్రంలో విజయశాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, రావు రమేష్, పోసాని కృష్ణమురళి, సంగీత, హరితేజ, తమన్నా, వెన్నెల కిశోర్, సత్యదేవ్, అజయ్, సుబ్బరాజు, నరేష్, రఘుబాబు, సత్యం రాజేష్, బండ్ల గణేష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.