ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకి ఫుల్ పవర్స్..
లిక్కర్, ఇసుక అక్రమ తరలింపులపై ఏపీ సర్కార్ ఉక్కుపాదం మోపడానికి సిద్దమైంది. అందుకోసం ఇప్పటికే ప్రత్యేక జీవో ద్వారా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని రంగంలోకి దించింది. తాజాగా ఈ స్పెషల్ బ్యూరోకి సిబ్బందిని కేటాయించారు. ఎక్సైజ్ శాఖకు చెందిన 70 శాతం ఉద్యోగులు, సిబ్బందిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకి బదిలీ చేశారు. దీంతో కేవలం 30 శాతం ఉద్యోగులు, సిబ్బందితోనే ఎక్సైజ్ శాఖ పని చేయనుంది. కేడర్ పోస్టుల నుంచి ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ వరకు […]
లిక్కర్, ఇసుక అక్రమ తరలింపులపై ఏపీ సర్కార్ ఉక్కుపాదం మోపడానికి సిద్దమైంది. అందుకోసం ఇప్పటికే ప్రత్యేక జీవో ద్వారా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని రంగంలోకి దించింది. తాజాగా ఈ స్పెషల్ బ్యూరోకి సిబ్బందిని కేటాయించారు. ఎక్సైజ్ శాఖకు చెందిన 70 శాతం ఉద్యోగులు, సిబ్బందిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకి బదిలీ చేశారు. దీంతో కేవలం 30 శాతం ఉద్యోగులు, సిబ్బందితోనే ఎక్సైజ్ శాఖ పని చేయనుంది.
కేడర్ పోస్టుల నుంచి ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ వరకు ఎక్సైజ్-ఎస్ఈబీ మధ్య డివైడ్ చేయనున్నారు. ప్రజంట్ ఉన్న 6,274 పోస్టులకు గాను… ఎస్ఈబీకి 4,394, ఎక్సైజ్ శాఖకు 1881పోస్టులు కేటాయించారు. ప్రస్తుతం ఎక్సైజ్ శాఖలో సిబ్బందిని 70:30 ప్రాతిపదికన ఎస్ఈబీ-ఎక్సైజ్ శాఖకు కేటాయింపులు జరిపారు. ఎక్సైజ్ శాఖకు ఉన్న ఎన్ఫోర్స్మెంట్ విధులన్నీ ఎస్ఈబీకి బదిలీ చేశారు. 208 ఎక్సైజ్ స్టేషన్లను ఎస్ఈబీ పరిధిలోకి తీసుకొస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.