Nupur Sharma: నుపుర్ శర్మ హత్యకు ప్లాన్..! పోలీసుల అదుపులో ఉగ్రవాది.. తెరవెనుక ఎవరున్నారంటే..
మహ్మద్ ప్రవక్త గురించి వివాదస్పద వ్యాఖ్యల చేసిన, బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ హత్యకు ప్లాన్ చేసిన ఓ ఉగ్రవాదిని ఉత్తరప్రదేశ్ కు చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) పోలీసులు
Nupur Sharma: మహ్మద్ ప్రవక్త గురించి వివాదస్పద వ్యాఖ్యల చేసిన, బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ హత్యకు ప్లాన్ చేసిన ఓ ఉగ్రవాదిని ఉత్తరప్రదేశ్ కు చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ కు చెందిన ముష్కరులు నుపుర్ శర్మను హతమార్చాలని సహ్రాన్ పూర్ లోని కుండా కాలా గ్రామానికి చెందిన మహమ్మద్ నదీమ్ కు పని అప్పగించారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థలు జైషే మహ్మద్, తెహ్రీఖ్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ తో నదీమ్ కు సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్న ISISకు చెందిన ఉగ్రవాదులను ఉత్తరప్రదేశ్ లోని ఏటీఎస్ పోలీసులు అరెస్టు చేసిన కొద్దిరోజులకే నుపుర్ శర్మ హత్యకు ప్లాన్ చేస్తున్న ఉగ్రవాదిని సహ్రాన్ పూర్ లో అదుపులోకి తీసుకున్నారు. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఓవ్యక్తి నదీమ్ కు ఈపని అప్పగించినట్లు విచారణలో తేలినట్లు ATS పోలీసులు తెలిపారు. నుపుర్ శర్మ హత్యకు ప్లాన్ చేసిన ఘటనలో మరికొంతమంది పేర్లను నిందితుడు వెల్లడించాడని.. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Uttar Pradesh | The Anti-Terrorism Squad of UP has arrested Jaish-e-Mohammed and Tehrikh-e-Taliban Pakistan-linked terrorist from Saharanpur: UP ATS pic.twitter.com/isre3l2sR1
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 12, 2022
జైషే మహ్మద్, తెహ్రీఖ్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్(TTP) ఉగ్రవాద సంస్థలకు చెందిన వ్యక్తులు నేరుగా నదీమ్ తో సంప్రదింపులు జరిపారని, ఆ ఉగ్రవాద సంస్థల భావాజాలానికి నదీమ్ ప్రభావితమయ్యాడని తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ లోని ప్రభుత్వ కార్యాలయాలు, పోలీసులపైనా దాడులకు ప్లాన్ జరుగుతుందన్న విషయంలో తాము విచారణ చేస్తుండగా.. నుపుర్ హత్యకు కుట్రపన్నిన విషయం వెలుగులోకి వచ్చిందని ATS పోలీసులు తెలిపారు. సైఫుల్లా అనే పాకిస్తాన్ కు చెందిన వ్యక్తి నదీమ్ కి శిక్షణ ఇస్తున్నాడని.. ప్రత్యేక శిక్షణ కోసం పాకిస్తాన్ వెళ్లేందుకు సిద్ధమయ్యాడని.. ఈవిషయం తన ఫోను రికార్డులు, మెసెజ్ ల ద్వారా జరిగిన సంభాషణలో తెలుస్తుందని పోలీసులు పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..