‘దయ చేసి ఆమెపై రూమర్స్ ఆపేయండి’.. దిశా కుటుంబం

బాలీవుడ్ నటుడు దివంగత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ మేనేజర్ దిశా శాలియన్ ఆత్మహత్యపై రకరకాల వార్తలు, ఫేక్ వార్తలను నిలిపివేయాలని ఆమె కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఆమె గత జూన్ 8 న ముంబైలోని..

'దయ చేసి ఆమెపై రూమర్స్ ఆపేయండి'.. దిశా కుటుంబం
Follow us

| Edited By: Jyothi Gadda

Updated on: Jul 06, 2020 | 7:07 PM

బాలీవుడ్ నటుడు దివంగత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ మేనేజర్ దిశా శాలియన్ ఆత్మహత్యపై రకరకాల వార్తలు, ఫేక్ వార్తలను నిలిపివేయాలని ఆమె కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఆమె గత జూన్ 8 న ముంబైలోని తన అపార్ట్ మెంట్ 14 వ అంతస్థు నుంచి కిందికి దూకి సూసైడ్ కి పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటన అనంతరం సోషల్ మీడియాలో, వార్తా పత్రికల్లో ఎన్నో అనవసరమైన వదంతులు, కుట్ర థియరీలు, ఊహాగానాలు వస్తున్నాయని, వాటిని నిలిపివేయాలని ఆ కుటుంబం ఓ ప్రకటనలో కోరింది. అసలే తమకుటుంబ సభ్యురాలి మృతితో ఎంతో ఆవేదనలో ఉన్న తాము వీటిని చూసి మరింత బాధ పడుతున్నామని వారు అన్నారు. దిశా మరణం తమకు అమిత దుఃఖాన్ని మిగిల్చిందని, ఇప్పుడిప్పుడే ఆ భారం నుంచి తేరుకుంటున్న తమను ఇవి ఇంకా క్షోభకు గురి చేస్తున్నాయన్నారు. ముఖ్యంగా దిశా పేరెంట్స్ చాలా ఆవేదన చెందుతున్నారని, అందువల్ల దయచేసి ఫేక్ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాలని తమ స్టేట్ మెంట్ లో పేర్కొన్నారు.