‘ఇల్లు ఖాళీ చేస్తున్నా..టీ కి రండి’…బీజేపీ నేతకు ప్రియాంక గాంధీ ఆహ్వానం

కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఢిల్లీ లోధీ రోడ్డులోని తన బంగళాను ఖాళీ చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ లోగా టీ తాగేందుకు తన ఇంటికి రావలసిందిగా ఆమె బీజేపీ నేత అనిల్ బలూనీని ఆహ్వానించారు. తాజాగా..

'ఇల్లు ఖాళీ చేస్తున్నా..టీ కి రండి'...బీజేపీ నేతకు ప్రియాంక గాంధీ ఆహ్వానం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 27, 2020 | 11:17 AM

కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఢిల్లీ లోధీ రోడ్డులోని తన బంగళాను ఖాళీ చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ లోగా టీ తాగేందుకు తన ఇంటికి రావలసిందిగా ఆమె బీజేపీ నేత అనిల్ బలూనీని ఆహ్వానించారు. తాజాగా ఆయనకు ఈ భవనాన్ని ప్రభుత్వం కేటాయించింది. 1997 నుంచే ప్రియాంక గాంధీ ఈ బంగళాలో నివసిస్తున్నారు.  అయితే ఆమెకు సర్కార్ ఎస్ పీజీ భద్రతను ఉపసంహరించడంతో..ఆగస్టు 1 కల్లా దీన్ని ఖాళీ చేయాలని నోటీసులు పంపారు. అధికారిక నివాసాన్ని ఏ నేత అయినా ఖాళీ చేసేటప్పుడు ఆ బంగళాను కేటాయించిన వ్యక్తికి మర్యాదపూర్వకంగా సదరు నేత ఇలా టీకి ఆహ్వానించడం సంప్రదాయంగా వస్తోందట.

ప్రియాంక కార్యాలయం నుంచి అనిల్ బలూనీ ఆఫీసుకు ఈ మేరకు ఇన్విటేషన్, ఫోన్ కాల్ వెళ్లిందని, అయితే ఆయన ఇంకా స్పందించలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రియాంక గురుగ్రామ్ లోని తన ఇంటిలో ఉంటున్నారు. తిరిగి ఢిల్లీకి వచ్చి.. యూపీకి వెళ్తారా.. అక్కడ లక్నోలోని బంగళాలో నివసిస్తారా అన్న విషయాలు తెలియాల్సి ఉంది.