మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్యంపై లేటెస్ట్ అప్డేట్స్ ఇవే..
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఆదివారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన వయస్సు 87 సంవత్సరాలు. అకస్మాత్తుగా ఛాతి నొప్పిరావడంతో.. ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్లో చేర్చారు. ట్రీట్మెంట్లో భాగంగా.. ఇచ్చిన మెడిసిన్ ద్వారా.. ఆయనకు తీవ్ర జ్వరం వచ్చిందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. దీంతో వెంటనే మన్మోహన్ సింగ్కు కరోనా టెస్టులు కూడా చేశామని ఎయిమ్స్ బృందం తెలిపింది. రిపోర్టుల్లో కరోనా నెగిటివ్ వచ్చిందని.. ప్రస్తుతం మెడికల్ ట్రీట్మెంట్కు ఆయన […]
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఆదివారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన వయస్సు 87 సంవత్సరాలు. అకస్మాత్తుగా ఛాతి నొప్పిరావడంతో.. ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్లో చేర్చారు. ట్రీట్మెంట్లో భాగంగా.. ఇచ్చిన మెడిసిన్ ద్వారా.. ఆయనకు తీవ్ర జ్వరం వచ్చిందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. దీంతో వెంటనే మన్మోహన్ సింగ్కు కరోనా టెస్టులు కూడా చేశామని ఎయిమ్స్ బృందం తెలిపింది. రిపోర్టుల్లో కరోనా నెగిటివ్ వచ్చిందని.. ప్రస్తుతం మెడికల్ ట్రీట్మెంట్కు ఆయన శరీరం సహకరిస్తోందని.. ఆయన్ను త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.
కాగా.. మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితిపై భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాడు ఎయిమ్స్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నానంటూ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
భారతీయ వైద్య విజ్ఞాన సంస్థ (ఏయిమ్స్) నిర్దేశకుడితో మాట్లాడి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశాను. వారి ఆరోగ్యం కుదుటపడుతోందని తెలిసి సంతోషిస్తున్నాను. మన్మోహన్ సింగ్ గారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని కోరుతున్నాను.
— Vice President of India (@VPSecretariat) May 12, 2020