స్కూళ్ళు, కాలేజీలు మరో నాలుగు వారాలు మూసివేత ?
దేశంలో లాక్ డౌన్ కాల పరిమితిని ఈ నెల 14 తరువాత కూడా పొడిగిస్తారా. లేక ఎత్తి వేస్తారా అన్న సందేహాల నడుమ.. కేంద్ర మంత్రి బృందమొకటి కీలక ప్రతిపాదన చేసింది. అన్ని విద్యాసంస్థలను మరో 4 వారాల పాటు మూసి వేయాలని సూచించింది.
దేశంలో లాక్ డౌన్ కాల పరిమితిని ఈ నెల 14 తరువాత కూడా పొడిగిస్తారా. లేక ఎత్తి వేస్తారా అన్న సందేహాల నడుమ.. కేంద్ర మంత్రి బృందమొకటి కీలక ప్రతిపాదన చేసింది. అన్ని విద్యాసంస్థలను మరో 4 వారాల పాటు మూసి వేయాలని సూచించింది. కరోనా వైరస్ కేసులు పెరుగుతుండడంతో.. లాక్ డౌన్ పొడిగించాలని యూపీ సహా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. అయితే లాక్ డౌన్ పొడిగించినా లేదా ఎత్తివేసినా దానితో నిమిత్తం లేకుండా స్కూళ్ళు, కాలేజీలను నాలుగు వారాల పాటు మూసివేయాలని ఈ బృందం అభిప్రాయపడింది. పైగా సమ్మర్ వెకేషన్ కూడా ఎంటరవుతోంది. అదే సమయంలో ప్రార్థనా కేంద్రాలు, మతపరమైన కూడళ్ల వద్ద పెద్ద సంఖ్యలో జనం గుమికూడకుండా చూసేందుకు డ్రోన్లను వినియోగించాలని ఈ బృందం సిఫారసు చేసింది. ఏప్రిల్ 14 తరువాత నాలుగు వారాల పాటు షాపింగ్ మాల్స్ కూడా మూసివేయాలని కూడా అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో హోమ్ మంత్రి అమిత్ షా, ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. కాగా గత 24 గంటల్లో కొత్తగా 508 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ సంఖ్య మొత్తానికి 4, 789 కి చేరింది. 124 మంది కరోనా రోగులు మృతి చెందారు.