Jammu Kashmir: జమ్మూకశ్మీర్లో అరగంట వ్యవధిలో 2 చోట్ల ఉగ్రవాదుల దాడులు.. ఇద్దరికి గాయాలు
బుద్గాం, శ్రీనగర్లోని రెండు చోట్ల అరగంట వ్యవధిలో ఉగ్రవాదులు గ్రెనేడ్లు విసిరారు. ఈ దాడిలో ఒక పోలీసు సహా ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.
జమ్మూకశ్మీర్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు భంగం కలిగించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. అరగంట వ్యవధిలోనే రెండు వేర్వేరు చోట్ల ఉగ్రవాదులు గ్రెనేడ్లు విసిరారు. బుద్గాంలోని గోపాలపురా చదూరా ప్రాంతంలో ఉగ్రవాదులు గ్రెనేడ్తో దాడి చేసినట్లు రాత్రి 9:05 గంటలకు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో కరణ్ కుమార్ సింగ్ అనే వ్యక్తి గాయపడ్డాడు. ఆ తర్వాత ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం పోలీసులు ఆ మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టారు.
దీని తర్వాత, కాశ్మీర్ జోన్ పోలీసులు రాత్రి 9.35 గంటలకు ట్వీట్ చేస్తూ, శ్రీనగర్లోని పోలీసు కంట్రోల్ రూమ్పై ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరారని సమచారం అందించారు. ఈ దాడిలో ఓ పోలీసు సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి.
J&K | Terrorists hurled grenade in Gopalpora Chadoora area of Budgam in which one civilian namely Karan Kumar Singh got injured; his condition is stated to be stable. Area cordoned off. Further details awaited: Police
(Visuals deferred by unspecified time) pic.twitter.com/bJ3x6ok1Iy
— ANI (@ANI) August 15, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..