BJP: స్కిల్ డెవలప్మెంట్పై స్పందించిన కేంద్ర మంత్రి.. కాంగ్రెస్కు గట్టి కౌంటర్..
కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు సమాచారం, బూటకపు ప్రచారం చేస్తోందని విమర్శించారు. మోసంతో మాత్రమే నిలదొక్కుకోగలదని అందుకే తరచుగా అబద్ధాలు చెప్పడానికి తొందరపడుతుంటారని ఆరోపించారు. కాంగ్రెస్ వాస్తవాలపై కళ్ళు మూసుకుంటుందని ఎద్దేవా చేశారు. ఇష్టానుసారంగా గణాంకాలను తప్పుగా చూపుతుందని మండిపడ్డారు.
![BJP: స్కిల్ డెవలప్మెంట్పై స్పందించిన కేంద్ర మంత్రి.. కాంగ్రెస్కు గట్టి కౌంటర్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/12/union-minister-dharmendra-pradhan.jpg?w=1280)
కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు సమాచారం, బూటకపు ప్రచారం చేస్తోందని విమర్శించారు. మోసంతో మాత్రమే నిలదొక్కుకోగలదని అందుకే తరచుగా అబద్ధాలు చెప్పడానికి తొందరపడుతుంటారని ఆరోపించారు. కాంగ్రెస్ వాస్తవాలపై కళ్ళు మూసుకుంటుందని ఎద్దేవా చేశారు. ఇష్టానుసారంగా గణాంకాలను తప్పుగా చూపుతుందని మండిపడ్డారు. భారతదేశంలో 40కోట్ల మందికిపైగా పని చేసే యువత సిద్దంగా ఉందని పేర్కొన్నారు. 2015 నుండి దేశవ్యాప్తంగా వివిధ పథకాల కింద 7 కోట్ల మందికి పైగా ప్రజలు ఉపాధి నైపుణ్యాలను కలిగి ఉన్నట్లు గణాంకాలను వివరించారు. ఖర్గేకు మరింత జ్ఞానోదయం కలిగించడానికి ఎక్స్ వేదికగా పూర్తి వివరాలు అదజేస్తున్నట్లు తెలిపారు. 1.5 కోట్ల మంది ప్రజలు, అంటే 3-4% మంది, కేవలం స్కిల్ ఇండియాలోని ఒక భాగం PMKVYలో నైపుణ్యం కలిగి ఉన్నారని ట్వీట్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా మరికొన్ని పారిశ్రామిక నిర్వహణలో ఉన్న 20కి పైగా మంత్రిత్వ శాఖలు ఈ జనాభాలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు దోహదపడుతున్నట్లు తెలిపారు.
PMKVY పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులలో 43% మంది వర్క్ఫోర్స్లో చేరినట్లు వివరించారు. RPL కాంపోనెంట్ కింద 66.47 లక్షల మంది వ్యక్తుల నైపుణ్యంలో వచ్చిన సమస్యలను అధిగమించి చక్కని పరిష్కారం దిశగా అడుగులు వేశారన్నారు. వీరంతా ఇప్పుడు ఉపాధి, ఉద్యోగ అవకాశాలతో హాయిగా ఉన్నారని ఉపాధి కోసం ఎలాంటి చింతించనవసరంలేదని పేర్కొన్నారు. అలాగే అప్రెంటీస్షిప్ పోర్టల్లో రిజిస్టర్ అయిన 1.82 లక్షలకు పైగా నిరుద్యోగులు కొత్తగా నిర్మించిన పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకున్నట్లు తెలిపారు. వీరి సంఖ్య 28 లక్షలుగా వెల్లడించారు. గత 7 దశాబ్దాల్లో కాంగ్రెస్ 10,000 ఐటీఐలను నిర్మించిందని తెలిపారు. మోడీ ప్రభుత్వం గత దశాబ్దంలో 5,000 ఐటీఐలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. NEP-నేతృత్వంలోని సంస్కరణలు, SIDH (స్కిల్ ఇండియా డిజిటల్ హబ్) , APAAR ఫ్రేమ్వర్క్ ద్వారా పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాఠ్యాంశాల్లోనే నైపుణ్యాభివృద్ధిని ప్రధాన స్రవంతి చేశామన్నారు. భారతదేశాన్ని నైపుణ్యం కలిగిన మానవశక్తిగా ప్రపంచ దేశాల్లో గుర్తింపు వచ్చేలా మార్చాలనే ఆలోచనకు ప్రధాని శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. గతంలో కాంగ్రెస్ నాయకులు ఇలా చేయడంపై సందేహం వ్యక్తం చేస్తే.. నేడు, భారతీయులు తమ సామర్థ్యాలను పెంపొందించుకొని ప్రపంచానికి స్పూర్తిగా నిలుస్తున్నారరన్నారు.
Shriman @kharge saheb knows that Congress Party can stay afloat only on the back of misinformation, fakery and deception. But, often, in their haste to peddle lies, Congress closes its eyes on facts and misrepresents figures at will.
▪️The 40 crore people that Kharge ji is… https://t.co/t5wfEuDShr
— Dharmendra Pradhan (@dpradhanbjp) February 22, 2024
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..