Corona Endemic: దేశంలో కరోనా విలయతాండవం.. గుడ్ న్యూస్ చెప్పిన ఐసీఎంఆర్ సైంటిస్ట్.!!

దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విలయతాండవం సృష్టిస్తోంది. ఒకవైపు ఒమిక్రాన్.. మరోవైపు కోవిడ్ పాజిటివ్ కేసులు...

Corona Endemic: దేశంలో కరోనా విలయతాండవం.. గుడ్ న్యూస్ చెప్పిన ఐసీఎంఆర్ సైంటిస్ట్.!!
Corona

Updated on: Jan 19, 2022 | 2:51 PM

దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విలయతాండవం సృష్టిస్తోంది. ఒకవైపు ఒమిక్రాన్.. మరోవైపు కోవిడ్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతూపోతున్నాయి. తాజాగా రోజువారీ నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపుగా మూడు లక్షలకు చేరువ కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో ఐసీఎంఆర్ సైంటిస్ట్ ఒకరు ఊరటనిచ్చే వార్తను వినిపించారు. మార్చి 11 నాటికి కరోనా ఎండమిక్ స్టేజికి చేరుకుంటుందని ఐసీఎంఆర్ ఎపిడెమియోలాజిస్ట్ డి సమీరన్ పాండా వెల్లడించారు.

నిపుణుల అంచనా ప్రకారం.. దేశంలో డిసెంబర్ 11 నుంచి ప్రారంభమైన ఒమిక్రాన్ వేవ్.. మూడు నెలల పాటు కొనసాగే అవకాశం ఉంది. మార్చి 11 తర్వాత కరోనా నుంచి ఉపశమనం పొందొచ్చు. మనం అజాగ్రత్త వహించకుండా ఉంటే.. డెల్టాను ఒమిక్రాన్ అధిగమిస్తే.. కొత్త వేరియంట్లేవి ఉద్భవించకపోతే మార్చి 11 నాటికి కోవిడ్ సాధారణ ఫ్లూగా మారుతుందని సమీరన్ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా వివిధ దశల్లో ఉంది. ఢిల్లీ, ముంబై లాంటి నగరాల్లో కోవిడ్ కేసులు గరిష్ట స్థాయికి చేరాయా.? లేదా.? అనే విషయం తెలియాలంటే మరో రెండు వారాలు వేచి చూడాలి. కరోనా రూపాంతరాల నేపధ్యంలో ఐసీఎంఆర్ కూడా టెస్టింగ్ వ్యూహాల్లో మార్పులు చేస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us