సరిహద్దుల్లో లౌడ్ స్పీకర్లు, పంజాబీ పాటల తో హోరెత్తిస్తున్న చైనా ‘చిచ్చోర్లు’ !

వాస్తవాధీన రేఖ వద్ద ముఖ్యంగా ఫింగర్-4 ప్రాంతంలో భారత దళాల దృష్టి మళ్లించేందుకు చైనా సైనికులు పెద్దగా లౌడ్ స్పీకర్లు పెట్టి వాటిలో పంజాబీ పాటలతో హోరెత్తిస్తున్నారట..  ఇండియన్ ఆర్మీని తప్పుదారి పట్టించేందుకు వాళ్ళు..

సరిహద్దుల్లో లౌడ్  స్పీకర్లు, పంజాబీ పాటల తో హోరెత్తిస్తున్న చైనా 'చిచ్చోర్లు' !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 17, 2020 | 11:12 AM

వాస్తవాధీన రేఖ వద్ద ముఖ్యంగా ఫింగర్-4 ప్రాంతంలో భారత దళాల దృష్టి మళ్లించేందుకు చైనా సైనికులు పెద్దగా లౌడ్ స్పీకర్లు పెట్టి వాటిలో పంజాబీ పాటలతో హోరెత్తిస్తున్నారట..  ఇండియన్ ఆర్మీని తప్పుదారి పట్టించేందుకు వాళ్ళు ఈ పాత ప్రాపగాండాను వినియోగించుకుంటున్నారని వెల్లడైంది. ఇక్కడ భారత జవాన్లు 24 గంటలూ అప్రమత్తంగా ఉంటూ చైనావారి ఆగడాలపై కన్నేయడంతో తామేదో భారత అభిమానులమన్నట్టు వాళ్ళుఇలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నారు. మరి ఈ డ్రామా ఎంతకాలం కొనసాగుతుందో  తెలియదు. ఈ నెల 8 న ఉభయ దేశాల సైనికుల మధ్య వంద  వార్నింగ్ షాట్స్ పేలిన సంగతి తెలిసిందే.