బాలీవుడ్ నటి స్వర భాస్కర్కు ఊరట
బాలీవుడ్ నటి స్వర భాస్కర్కు ఊరట లభించింది. బాబ్రీ మసీదు, అయోధ్య భూ వివాద కేసులో తీర్పుపై కించపర్చే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు స్వర భాస్కర్ ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే..
బాలీవుడ్ నటి స్వర భాస్కర్కు ఊరట లభించింది. బాబ్రీ మసీదు, అయోధ్య భూ వివాద కేసులో తీర్పుపై కించపర్చే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు స్వర భాస్కర్ ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే స్వర భాస్కర్పై కోర్టు ధిక్కార చర్యకు సమ్మతి తెలిపేందుకు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తిరస్కరించారు. ఈ ప్రకటన నేరపూరిత ధిక్కారం కాదు అని ఆయన పేర్కొన్నారు. స్వర భాస్కర్ వ్యాఖ్యల్లో సుప్రీంకోర్టుపై ఎటువంటి అభ్యంతరకర వాఖ్య లేదని, సుప్రీం అధికారాన్ని తగ్గించే ప్రయత్నం జరగలేదని ఏజీ వెల్లడించారు. ఆమె వ్యక్తిగత అభిప్రాయాలుగా పేర్కొన్నారు. ఒక వ్యక్తిపైన అయినా కోర్టు ధిక్కార చర్యలను ప్రారంభించాలంటే కోర్టు ధిక్కార చట్టం, 1971లోని సెక్షన్ 15 ప్రకారం అటార్నీ జనరల్ లేదా సొలిసిటర్ జనరల్ అనుమతి అవసరమని తెలిపారు ఏజే.