అసోం ఎఫెక్ట్.. పందుల దిగుమతికి చెక్ పెట్టిన మేఘాలయ..!
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. అసోం, అరుణాచల్ ప్రదేశ్లో పందులు వింత వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇప్పటికే అసోంలోని ఆరు జిల్లాల్లో దాదాపు రెండు వేల పందులు చనిపోయాయి. తొలుత స్వైన్ ప్లూ అనుకున్నా.. ఆ తర్వాత అవి వేరే వైరస్ కారణంగానే మృతిచెందుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో మేఘాలయ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక పొరుగు రాష్ట్రాల నుంచి పందుల దిగుమతులను నిషేధిస్తూ మేఘాలయ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ […]
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. అసోం, అరుణాచల్ ప్రదేశ్లో పందులు వింత వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇప్పటికే అసోంలోని ఆరు జిల్లాల్లో దాదాపు రెండు వేల పందులు చనిపోయాయి. తొలుత స్వైన్ ప్లూ అనుకున్నా.. ఆ తర్వాత అవి వేరే వైరస్ కారణంగానే మృతిచెందుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో మేఘాలయ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక పొరుగు రాష్ట్రాల నుంచి పందుల దిగుమతులను నిషేధిస్తూ మేఘాలయ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. అసోం, అరుణాచల్ ప్రదేశ్లలో వైరస్సోకి పందులు మరణిస్తున్న నేపథ్యంలోనే.. ఆయా రాష్ట్రాల నుంచి పందుల రవాణ, దిగుమతిని నిషేధిస్తున్నట్లు మేఘాలయ పశుసంవర్థక శాఖ ప్రిన్పిపల్ సెక్రటరీ ఎస్పీ అహ్మద్ తెలిపారు. అంతేకాదు.. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ పందుల ఫాం హౌస్లలో క్రిమిసంహారక మందులను స్ప్రే చేయించాలని.. బయటి నుంచి వచ్చే వారిని అనుమతించకూడదని ప్రభుత్వం పేర్కొంది.
కాగా.. కరోనా విముక్త రాష్ట్రంగా ఉన్న మేఘాలయ.. ఇప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక్కడ కేవలం ఇద్దరు కరోనా బారినపడ్డారు. వారిద్దరు కూడా కరోనాను జయించి.. ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం మేఘాలయ రాష్ట్రంలో కరోనా కేసులు ఒక్కటి కూడా లేదు.