‘మహా సముద్రం’ కోసం గోవా వెళ్లనున్న టీమ్..!
శర్వానంద్, సిద్ధార్థ్లతో 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న క్రేజీ మల్టీస్టారర్ 'మహా సముద్రం'. అదితీరావు హైదారీ, అను ఇమ్మాన్యుల్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు
Maha Samudram update: శర్వానంద్, సిద్ధార్థ్లతో ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న క్రేజీ మల్టీస్టారర్ ‘మహా సముద్రం’. అదితీరావు హైదారీ, అను ఇమ్మాన్యుల్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఈ నెల నుంచి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా మొదటి షెడ్యూల్ని గోవాలో ప్లాన్ చేశారట దర్శకుడు. ఈ షెడ్యూల్లో ప్రధాన తారాగణం మొత్తం పాల్గొనబోతున్నట్లు సమాచారం. (RRR: ‘ఆర్ఆర్ఆర్’లో అడుగుపెట్టనున్న లేడీ స్కాట్)
ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ మూవీలో కమర్షియల్ ఎలిమెంట్లు, ట్విస్ట్లు చాలానే ఉండనున్నట్లు టాక్. కాగా ఈ మూవీతో దాదాపు 8 ఏళ్ల తరువాత సిద్ధార్థ్ తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్నారు. దీనిపై సంతోషాన్ని వ్యక్తం చేసిన సిద్ధార్థ్.. ”నేను మళ్లీ వచ్చేస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది” అంటూ ఓ ట్వీట్ చేశారు. ఇక ఈ మల్టీస్టారర్పై టాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి. ( పవన్ మూవీ కోసం నితిన్ కీలక నిర్ణయం..!)