ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. సీజ్ చేసిన వాహనాలు విడుదలకు గ్రీన్ సిగ్నల్..
లాక్డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి రోడ్డెక్కిన వాహనాలను పోలీసుల సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక అలాంటివారికి ఏపీ పోలీసులు గుడ్ న్యూస్ అందించారు. లాక్ డౌన్లో పట్టుబడిన వాహనాలను తిరిగి అప్పగిస్తామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. వాహనాలకు సంబంధించిన డాక్యుమెంట్స్తో సంబంధిత పీఎస్లను సంప్రదించాలని ఆయన సూచించారు. ఇప్పటికే ఈ విషయంపై జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. జరిమానాలు చెల్లించి ఎవరి వాహనం వారు తీసుకెళ్ళవచ్చునని అన్నారు. కాగా, ఏపీలో లాక్ […]
లాక్డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి రోడ్డెక్కిన వాహనాలను పోలీసుల సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక అలాంటివారికి ఏపీ పోలీసులు గుడ్ న్యూస్ అందించారు. లాక్ డౌన్లో పట్టుబడిన వాహనాలను తిరిగి అప్పగిస్తామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. వాహనాలకు సంబంధించిన డాక్యుమెంట్స్తో సంబంధిత పీఎస్లను సంప్రదించాలని ఆయన సూచించారు.
ఇప్పటికే ఈ విషయంపై జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. జరిమానాలు చెల్లించి ఎవరి వాహనం వారు తీసుకెళ్ళవచ్చునని అన్నారు. కాగా, ఏపీలో లాక్ డౌన్ సడలింపులు భారీగా ఇవ్వడంతో ప్రజా వ్యవస్థ అంతా ఒక్కొక్కటిగా ప్రారంభమవుతోంది. మరోవైపు తెలంగాణలో లాక్ డౌన్ సమయంలో సీజ్ చేసిన వాహనాలను పోలీసులు విడుదల చేసేందుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
#covidupdates : #confiscatedvehicles during #COVIDー19 #lockdown period will be handed over to respective owners. Concerned Vehicle owners can contact respective police stations with relevant documents. #APPolice
— AP Police (@APPOLICE100) May 23, 2020
Read More:
కిమ్ గురించి మరో షాకింగ్ నిజం.. నార్త్ కొరియాలో కలకలం..
మరో కొత్త వైరస్ కలకలం.. వందల సంఖ్యలో గుర్రాలు మృతి..
జేఎన్టీయూ కీలక నిర్ణయం.. జూన్ 20 నుంచి బీటెక్ పరీక్షలు..