
మనం ఎక్కువ కాలం ఇంటికి దూరంగా ఉన్నప్పుడు, విద్యుత్ అంతరాయం ఏర్పడితే ఫ్రీజర్లోని ఐస్ కరిగిపోతుంది. కరెంట్ తిరిగి వచ్చినప్పుడు ఆ నీరు మళ్ళీ గడ్డకడుతుంది. దీనివల్ల మధ్యలో ఆహారం కరిగిపోయి, బ్యాక్టీరియా పెరిగిందని మనకు తెలియదు. ఈ సమస్యను గుర్తించడానికి ఒక చిన్న గిన్నెలో నీటిని పోసి ఫ్రిజ్లో ఉంచి పూర్తిగా గడ్డకట్టనివ్వాలి. మంచు గడ్డ తయారైన తర్వాత దానిపై ఒక చెంచాను అడ్డంగా ఉంచాలి. ఇప్పుడు ఆ కప్పును తిరిగి ఫ్రీజర్లోనే ఉంచి మీరు ప్రయాణానికి వెళ్ళవచ్చు.
మీరు ప్రయాణం నుండి తిరిగి వచ్చిన తర్వాత ఫ్రీజర్ను తెరిచి ఆ చెంచా ఎక్కడ ఉందో గమనించండి:
చెంచా మీరు పెట్టినట్లుగా మంచు పైనే ఉంటే, మీరు లేనప్పుడు కరెంట్ పోలేదని లేదా చాలా తక్కువ సమయం మాత్రమే పోయిందని అర్థం. ఆ ఆహారం తినడానికి సురక్షితంగా ఉంటుంది.
ఒకవేళ చెంచా మంచు గడ్డ మధ్యలోకి జారి ఉంటే, కరెంట్ చాలా సేపు పోయిందని, ఐస్ కొద్దిగా కరిగిందని అర్థం. ఇలాంటి సమయంలో ఆహారం పాడయ్యే అవకాశం ఉంది.
చెంచా కప్పు అడుగుకు వెళ్ళిపోయిందంటే, చాలా సేపటి వరకు కరెంట్ లేకపోవడం వల్ల ఐస్ పూర్తిగా కరిగిపోయిందని అర్థం. ఇలాంటి స్థితిలో ఫ్రిజ్లోని ఆహారం పూర్తిగా పాడైపోయి ఉంటుంది.
ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం
చెంచా కప్పు అడుగున లేదా మధ్యలో ఉంటే, ఫ్రిజ్లోని మాంసం, పాలు, పెరుగు వంటి పదార్థాలను ఏమాత్రం ఆలోచించకుండా పారవేయడం మంచిది. ఎందుకంటే కరిగిన ఆహారంలో బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. ఇది చిన్న విషయంగా అనిపించినప్పటికీ, మీ మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి ఈ చిట్కా ఎంతో మేలు చేస్తుంది. తదుపరిసారి మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు ఈ సులభమైన ‘చెంచా పరీక్ష’ను పాటించడం మర్చిపోకండి. ఇది మీ సమయాన్ని, ఆరోగ్యాన్ని రెండింటినీ కాపాడుతుంది.
గమనిక: ఈ సమాచారం అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన స్మార్ట్ హ్యాక్స్ ఆహార భద్రతా నిపుణుల సూచనల ఆధారంగా రూపొందించబడింది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. ఫ్రిజ్లో నిల్వ ఉంచే ఆహార పదార్థాల మన్నిక అనేది ఆ వస్తువు రకం వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. ఏదైనా అనుమానం ఉంటే ఆహారాన్ని రుచి చూడకుండా పారవేయడమే శ్రేయస్కరం.