అధికారపార్టీలో మినిస్టర్‌తో ఎమ్మెల్యే ఢీ

సహకార సంఘం ఎన్నికల్లో అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరుకు దారి తీసింది. ఓ మంత్రికి, ఎమ్మెల్యేకు మధ్య సమరానికి తెరలేపింది. పట్టు కోసం పాకులాడుతున్న ప్రజా ప్రతినిధులు వారి అనుచర గణాన్ని బరిలోకి దింపి సై అంటే సై అంటున్నారు. మహబూబాబాద్ జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ వర్గాల మధ్య కొనసాగుతున్న సహకార పోరు ఆసక్తికర చర్చగా మారింది. మహబూబాబాద్ జిల్లా నుంచి సత్యవతి రాథోడ్‌ మంత్రి అయ్యారు. సీనియర్‌ […]

అధికారపార్టీలో మినిస్టర్‌తో ఎమ్మెల్యే ఢీ
Follow us

| Edited By: Srinu

Updated on: Feb 13, 2020 | 1:39 PM

సహకార సంఘం ఎన్నికల్లో అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరుకు దారి తీసింది. ఓ మంత్రికి, ఎమ్మెల్యేకు మధ్య సమరానికి తెరలేపింది. పట్టు కోసం పాకులాడుతున్న ప్రజా ప్రతినిధులు వారి అనుచర గణాన్ని బరిలోకి దింపి సై అంటే సై అంటున్నారు. మహబూబాబాద్ జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ వర్గాల మధ్య కొనసాగుతున్న సహకార పోరు ఆసక్తికర చర్చగా మారింది.

మహబూబాబాద్ జిల్లా నుంచి సత్యవతి రాథోడ్‌ మంత్రి అయ్యారు. సీనియర్‌ ఎమ్మెల్యే రెడ్యా నాయక్‌కు పదవి దక్కలేదు. దీంతో అప్పటి నుంచి వీరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. తాజాగా సహకార ఎన్నికల్లో కూడా వీరి మధ్య ఫైట్‌ మొదలైంది. కురవి మండలం గుండ్రాతిమడుగు సహకార ఎన్నికల్లో పట్టు కోసం మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. రెండు వర్గాల నుంచి నేతలు ఎన్నికల బరిలోకి దిగారు. పోటాపోటీగా ప్రచారం కూడా మొదలుపెట్టారు.

ఈ ఎన్నికలు మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే అన్న రీతిలో జరుగుతున్నాయి. డోర్నకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రెడ్యా నాయక్ సూచించిన పెద్దలే చక్రం తిప్పుతున్నారు. గుండ్రాతి మడుగు సొసైటీ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా ఒకే పార్టీలో పోటీ కనిపిస్తుంది. మంత్రి సత్యవతి రాథోడ్‌కు గుండ్రాతిమడుగు సొంత ఊరు . దీంతో ఆమె ముఖ్య అనుచరుడైన కురవి జడ్పీటీసీ బండి వెంకట్ రెడ్డి తమ వర్గం తరపున అభ్యర్థులను బరిలోకి దింపారు. తమ వర్గం తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఎమ్మెల్యే రెడ్యానాయక్ మాత్రం తమ చైర్మన్ అభ్యర్థిగా గార్లపాటి వెంకట్ రెడ్డిని ప్రకటించి అన్ని స్థానాలకు అభ్యర్థులను బరిలో నిలిపారు. తమ వర్గం గెలిచి మంత్రిపై పైచేయి సాధించాలని చూస్తున్నారు. ఒకే పార్టీ నుంచి మంత్రి, ఎమ్మెల్యే వర్గీయులు సహకార ఎన్నికల్లో వేరువేరుగా అభ్యర్థులను బరిలో దించడం రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఒకే సామాజిక వర్గానికి చెందిన వీరు మూడు దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్థులు. రెండు వర్గాలుగా విడిపోయి ఉన్న మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇద్దరు ఒకే పార్టీలో చేరారు. అనంతరం జరిగిన పరిణామాలలో సత్యవతి రాథోడ్ కు ఉహించని రీతిలో మంత్రి పదవి వరించడంతో రెడ్యానాయక్‌‌తో పాటు తన వర్గీయులు జీర్ణించుకోలేపోతున్నారు. ఈ విషయం ఇన్ని రోజులు నిమురు గప్పిన నిప్పులా ఉన్నప్పటికీ తాజాగా సహకార ఎన్నికల్లో ఒక్క సారిగా బయటపడ్డాయి. ఎక్కడ నలుగురు వక్తులు కనిపి౦చిన ఇదే విషయం చర్చించు కుంటున్నారు. సహకార ఎన్నికలో ఎవరు పై చేయి సాధిస్తారో ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో