తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్. గోరక్పూర్ పోలింగ్ కేంద్రంలో యోగీ ఓటు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యూపీ ప్రజలు సంక్షేమ పాలనకే మద్దతిస్తారని అన్నారు. ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికలతో పాటు ఈ చివరి విడత కూడా ప్రశాంతంగా ముగుస్తాయన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ 300కు పై చిలుకు స్థానాల్లో విజయం సాధించి కేంద్రంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని యోగి జోస్యం చెప్పారు.
Uttar Pradesh Chief Minister Yogi Adityanath exercises his franchise at polling booth no. 246 in Gorakhpur. #LokSabhaElections2019 pic.twitter.com/heXwytEqlY
— ANI UP (@ANINewsUP) May 19, 2019