థాంక్యూ ధోని.. తలాకు బీసీసీఐ గౌరవ వీడ్కోలు..

యూఏఈలో ఐపీఎల్ 2020 ముగిసిన అనంతరం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అయితే ఈసారి జట్టుతో పాటు ధోని ఉండడు.

థాంక్యూ ధోని.. తలాకు బీసీసీఐ గౌరవ వీడ్కోలు..
Follow us

|

Updated on: Oct 28, 2020 | 6:47 PM

#ThankYouMSDhoni: యూఏఈలో ఐపీఎల్ 2020 ముగిసిన అనంతరం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అయితే ఈసారి జట్టుతో పాటు ధోని ఉండడు. చాలా ఏళ్ల తర్వాత మహేంద్ర సింగ్ ధోని లేకుండా భారత జట్టు చేస్తున్న తొలి విదేశీ పర్యటన ఇది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌కు ధోని చేసిన సేవలకు ధన్యవాదాలు తెలుపుతూ బీసీసీఐ అతడికి గౌరవ వీడ్కోలు తెలిపింది.

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తన అధికారిక ఫేస్‌బుక్, ట్విట్టర్ పేజీల కవర్ ఫోటోను మార్చింది. #ThankYouMSDhoni అంటూ ధోని పిక్చర్‌ను పెట్టి.. ఇన్నేళ్లుగా భారత క్రికెట్‌కు ధోని చేసిన ఎనలేని సేవలకు కృతజ్ఞతలు తెలిపింది. కాగా, ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు ఆగష్టు 15వ తేదీన రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Also Read:

ముంబై ఇండియన్స్‌కు షాక్.. టోర్నీ వీడనున్న హిట్‌మ్యాన్.!

మధ్యాహ్న భోజన పధకంలో మార్పులు.. ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు..

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంకు కొలువుల జాతర..

భక్తులకు శుభవార్త.. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల..

రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై తాజా హెల్త్ బులిటెన్..