తెలంగాణ కరోనా నేటి బులిటెన్ : కొత్తగా 2,924 కేసులు
తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. శనివారం కొత్తగా 2,924 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,23,090కి చేరింది.
తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. శనివారం కొత్తగా 2,924 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,23,090కి చేరింది. ఇక నిన్న ఒక్కరోజే కరోనాతో 10 మంది ప్రాణాలు విడిచినట్టు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం బులిటెన్లో వెల్లడించింది. దీంతో మృతుల సంఖ్య 818 కి చేరింది. కరోనా బారి నుంచి శనివారం మరో 1,638 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా నుంచి 90,988 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 31,284 యాక్టివ్ కేసులున్నాయి.
Also Read :
‘డియర్ కామ్రేడ్’ అరుదైన ఘనత : ఇండియాలోనే నెం.1
కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం : ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు