హత్రాస్ ఘటన, సమాజ్ వాదీ, ఆర్ ఎల్ డీ కార్యకర్తలపై పోలీసు లాఠీఛార్జ్

హత్రాస్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆదివారం వఛ్చిన సమాజ్ వాదీ, రాష్టీయ లోక్ దళ్ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ఒక దశలో వారిపై కార్యకర్తలు కూడా తిరగబడడంతో..

హత్రాస్ ఘటన, సమాజ్ వాదీ, ఆర్ ఎల్ డీ కార్యకర్తలపై పోలీసు లాఠీఛార్జ్

Edited By:

Updated on: Oct 04, 2020 | 6:13 PM

హత్రాస్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆదివారం వఛ్చిన సమాజ్ వాదీ, రాష్టీయ లోక్ దళ్ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ఒక దశలో వారిపై కార్యకర్తలు కూడా తిరగబడడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ గ్రామంలో నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయనికేవలం అయిదుగురిని మాత్రమే హత్రాస్ కుటుంబాన్ని పరామర్శించేందుకు అనుమతిస్తామని పోలీసు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ రెండు పార్టీల నేతలు, కార్యకర్తలు ఈ నిషేధాజ్ఞలను పట్టించుకోకుండా పెద్ద సంఖ్యలో రావడంతో వారిని పోలీసులు అడ్డగించారు. వారిని అదుపు చేసేందుకు నానా తంటాలు పడ్డారు. కాగా ఇక్కడికి చేరుకున్న ఈ పార్టీల ముఖ్య నాయకులెవరో స్పష్టం కాలేదు.