ఏపీ : ఇకపై రాష్ట్ర విపత్తులుగా వడగాల్పులు, బోటు బోల్తా ప్రమాదాలు
ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ఏర్పడే వడగాల్పులు, బోటు బోల్తా ప్రమాదాలను రాష్ట్ర విపత్తులుగా గుర్తిస్తూ, జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ఏర్పడే వడగాల్పులు, బోటు బోల్తా ప్రమాదాలను రాష్ట్ర విపత్తులుగా గుర్తిస్తూ, జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు మేరకు గతంలో గుర్తించిన పిడుగుపాటుతో పాటు, బోటు బోల్తా ప్రమాదాలు, వడగాల్పులను రాష్ట్ర విపత్తులుగా గుర్తిస్తూ రెవెన్యూ శాఖ ఆదేశాలు జారీ చేసింది. భారీ వర్షాలు, వరదలు, తుపాన్ల సమయంలో ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన సమయాల్లో జరిగిన ప్రమాదాలకు జాతీయ, రాష్ట్ర విపత్తు సహాయ నిధి నుంచి సాయం వర్తించేలా మార్గదర్శకాలు జారీ అయ్యాయి.
Also Read :
తెలంగాణ అలెర్ట్ : ఈ 15 జిల్లాలకు భారీ వర్ష సూచన