తనతో ఆడుకున్న చిన్నారి మృతదేహం జాడచూపిన పెంపుడు కుక్క
కేరళలో వరదలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. వరదల్లో కొట్టుకుపోయి ఎంతో మంది చనిపోయారు. కొండ చరియలు విరిగిపడి మరికొందరు ప్రాణాలు పొగొట్టుకున్నారు.
కేరళలో వరదలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. వరదల్లో కొట్టుకుపోయి ఎంతో మంది చనిపోయారు. కొండ చరియలు విరిగిపడి మరికొందరు ప్రాణాలు పొగొట్టుకున్నారు. నదిలో, కొండచరియల కింద ఇరుక్కుపోయిన డెడ్బాడీలను వెలికితీసేందుకు రెస్క్యూ టీమ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ సమయంలో ఓ పెంపుడు కుక్క తన యజమాని కూతురి డెడ్బాడీని వెతికి, సహాయక సిబ్బందికి జాడ చూపింది.
వివరాల్లోకి వెళ్తే..ఇడుక్కి జిల్లాకు చెందిన రెండేళ్ల ధనుష్క ఫ్యామిలీ ఎనిమిది రోజుల క్రితం వరద తీవ్రతకి గల్లంతయ్యింది. దీంతో ధనుష్క పెట్ డాగ్ ఒంటిరిగా మిగిలిపోయింది. వారి జాడ దొరుకుతుందేమో అని తీవ్రంగా వెతికింది. కానీ, లాభం లేకపోయింది. కానీ ప్రయత్నాన్ని విరమించలేదు. చివరిగా పెట్టిముడి నదిలో ధనుష్క ఆనవాళ్లను గుర్తించింది.
తనతో స్నేహం చేసిన ఆ బుజ్జి పాపను ఎలా బయటికి తీయాలో తెలియక.. అక్కడే తారసలాడుతోన్న కూవీని గమనించింది రెస్క్యూ టీమ్. అనుమానం వచ్చి అక్కడ గాలింపు చర్యలు చేపట్టింది. ఆ పరిసర ప్రాంతంలోనే నదిలో చెట్ల మధ్య ఇరుక్కుపోయిన ధనుష్క డెడ్బాడీ కనిపించింది. సిబ్బంది.. నదిలో నుంచి ఆ చిన్నారిని బయటకు తీశారు. ధనుష్క డెడ్బాడీ వచ్చింది కానీ, తనతో ఆడుకునేందుకు ఆ బుజ్జిపాప ఇక ఉండదని తెలిసి విలవిల్లాడిపోయింది కూవీ. ధనుష్క ఫాదర్ ప్రతీశ్ కుమార్ డెడ్బాడీ గత వారం లభ్యమైంది. తల్లి కస్తూరి, సోదరి ప్రియదర్శినిల జాడ ఇంకా తెలియలేదు. ఆ చిన్నారి బామ్మ మాత్రం క్షేమంగా బతికి బయటపడింది.
Also Read :