దేశానికి నెక్స్ట్ పీఎం కూడా మోదీనే.. నరేంద్రుడికే అత్యధిక ఓట్లు.!

|

Aug 08, 2020 | 3:32 PM

భారతదేశ తదుపరి ప్రధానిగా కూడా మరోసారి నరేంద్ర మోదీనే ఉండాలని దాదాపు 66 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నారు. ‘నెక్ట్స్ పీఎం’ ప్రాధాన్య జాబితాలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి కేవలం 8 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.

దేశానికి నెక్స్ట్ పీఎం కూడా మోదీనే.. నరేంద్రుడికే అత్యధిక ఓట్లు.!
Follow us on

Mood Of The Nation Poll: భారతదేశ తదుపరి ప్రధానిగా కూడా మరోసారి నరేంద్ర మోదీనే ఉండాలని దాదాపు 66 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నారు. తాజాగా జాతీయ మీడియా ఇండియా టుడే నిర్వహించిన ‘మూడ్ అఫ్ ది నేషన్’ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. అత్యధిక మంది ప్రజలు ప్రధానిగా మోదీకే ఓటు వేయడం విశేషం. దీనితో ప్రజలకు ఆయన మీద ఉన్న విశ్వాసం ఏమాత్రం తగ్గలేదని తాజా సర్వే వెల్లడించింది. ఇక ‘నెక్ట్స్ పీఎం’ ప్రాధాన్య జాబితాలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి కేవలం 8 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. అటు మూడో స్థానం దక్కించుకున్న కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 5 శాతం ఓట్లు సాధించారు.

ఇక ఈ లిస్టులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా(4%), ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాధ్(3%), ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(3%), వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(2%), కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ(2%), రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్(1%), నితిన్ గడ్కరీ(1%), శరద్ పవర్(1%), ఉద్దవ్ ఠాక్రే(1%), మాయావతి(1%) పేర్లను కూడా కొంతమంది ప్రతిపాదించారు. కాగా, ఈ సర్వేను ఢిల్లీకి చెందిన మార్కెట్ రీసెర్చ్ ఏజెన్సీ జూలై 15 నుంచి జూలై 27 మధ్య సుమారు 12,021 మంది అభిప్రాయాలను టెలిఫోన్ ఇంటర్వ్యూ ద్వారా సేకరించింది.

Also Read: పాపులర్ సీఎంల లిస్ట్: మూడో స్థానంలో వైఎస్ జగన్.!