సతీమణితో సీఎం రమేశ్ డ్యాన్స్..సింప్లీ సూపర్బ్..
బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ తనయుడు రిత్విక్తో ప్రముఖ పారిశ్రామికవేత్త రాజా తాళ్లూరి కుమార్తె పూజ నిశ్చితార్థం ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ ఎంగేజ్మెంట్ ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. టీడీపీ, వైఎస్సార్ సీపీ నేతలను బీజేపీలో చేర్చుకునేందకు బీజేపీ ఈ ఈవెంట్ను వాడుకుందనే రూమర్స్ విసృతంగా వ్యాపించాయి. ఇవన్నీ పక్కనబెడితే కొడుకు నిశ్చితార్థాన్ని సీఎం రమేశ్ ఓ రేంజ్లో ప్లాన్ చేశారు. దుబాయ్లో రూ.25 కోట్ల ఖర్చుతో అతిరథమహారథుల మధ్య ఈ […]
బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ తనయుడు రిత్విక్తో ప్రముఖ పారిశ్రామికవేత్త రాజా తాళ్లూరి కుమార్తె పూజ నిశ్చితార్థం ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ ఎంగేజ్మెంట్ ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. టీడీపీ, వైఎస్సార్ సీపీ నేతలను బీజేపీలో చేర్చుకునేందకు బీజేపీ ఈ ఈవెంట్ను వాడుకుందనే రూమర్స్ విసృతంగా వ్యాపించాయి. ఇవన్నీ పక్కనబెడితే కొడుకు నిశ్చితార్థాన్ని సీఎం రమేశ్ ఓ రేంజ్లో ప్లాన్ చేశారు. దుబాయ్లో రూ.25 కోట్ల ఖర్చుతో అతిరథమహారథుల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. కాగా అతిథుల కోసం సీఎం రమేష్ 15 ప్రత్యేక విమానాలు బుక్ చేయడం విశేషం. ఏపీలోని అన్నీ పార్టీల నాయకులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పలువురు రాజకీయ, సినీ స్టార్స్ ఈ వేడుకకు హాజరయ్యారు. దాదాపు 75 మంది ఎంపీలను సీఎం రమేశ్ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్టు సమాచారం.
ఇవన్నీ పక్కనబెడితే కుమారుడి నిశ్చితార్థం సందర్భంగా సీఎం రమేశ్ దంపతులు వేసిన స్టెప్పులు ఇప్పుడు వైరల్గా మారాయి. పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రంలోని అమ్మో..బాపుగారి బొమ్మో..సాంగ్కి ఈ కపుల్ అదిరిపోయే లెవల్లో డ్యాన్స్ చేశారు. దీంతో అక్కడ ఉన్నవాళ్లంతా చప్పట్లతో హోరెత్తించారు. ప్రస్తుతం ఈ విజువల్స్ టీవీ 9 ఎక్స్క్లూజీవ్గా మీ ముందు ఉంచబోతుంది.