“గిఫ్ట్‌ ఏ స్మైల్‌” అంబులెన్స్‌లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కార్యక్రమంలో భాగంగా అంబులెన్స్‌లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. గిఫ్ట్‌ ఏ స్మైల్‌లో భాగంగా  మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమ‌న్, మంచిర్యాల ఎమ్యెల్యే దివాక‌ర్ రావు అంబులెన్స్‌లను...

గిఫ్ట్‌ ఏ స్మైల్‌ అంబులెన్స్‌లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
Follow us

|

Updated on: Sep 24, 2020 | 11:50 AM

Minister KTR Launched : గిఫ్ట్‌ ఏ స్మైల్‌ కార్యక్రమంలో భాగంగా అంబులెన్స్‌లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. గిఫ్ట్‌ ఏ స్మైల్‌లో భాగంగా  మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమ‌న్, మంచిర్యాల ఎమ్యెల్యే దివాక‌ర్ రావు అంబులెన్స్‌లను అందించారు. అంద‌జేసిన కొవిడ్ రెస్పాన్స్ అంబులెన్స్ ల‌ను ఐటీ, మున్సిపల్ ‌శాఖ మంత్రి కేటీఆర్ గురువారం ప్రగతి భవన్‌లో జెండా ఊపి ప్రారంభించారు. మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి మూడు  అంబులెన్స్ లను, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ రెండు , మంచిర్యాల ఎమ్మెల్యే దివాక‌ర్ రావు ఒక అంబులెన్స్ ను గిఫ్ట్ గా ఇచ్చారు.

అంబులెన్స్‌లను కొవిడ్‌ సహాయక చర్యలకు ప్రభుత్వానికి అందజేసిన వారికి కేటీఆర్‌ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి మాట్లాడారు. మంత్రి కేటీఆర్‌ జన్మదిదనం సంద‌ర్భంగా ఇచ్చిన గిఫ్ట్ ఏ స్మైల్ ఏకార్యక్రమంలో భాగంగా కరోనా బాధితుల కోసం కొవిడ్ రెస్పాన్స్ అంబులెన్స్ ల‌ను గిఫ్ట్ గా ఇచ్చామ‌న్నారు. నిర్మల్, మంచిర్యాల జిల్లాలోని క‌లెక్టర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యశాలల నిర్వహణలో ఈ అంబులెన్స్ ల‌ను ప్రజలకు అందుబాటులో ఉంచుతామ‌న్నారు.