నిమ్స్కు వచ్చిన ప్రతి రోగికి చికిత్స .. మరింత మెరుగైన వైద్యం అందించాలని సూచించిన మంత్రి ఈటల
నిమ్స్కు వచ్చిన ప్రతి రోగికి చికిత్స అందించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. నిమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపరచడం కోసం వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి...
నిమ్స్కు వచ్చిన ప్రతి రోగికి చికిత్స అందించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. నిమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపరచడం కోసం వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, నిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ మనోహర్, సూపరింటెండెంట్ సత్యనారాయణతోపాటు… నిమ్స్లో ఉన్న అన్ని శాఖాధిపతులతో ఈటల సమీక్షించారు.
ప్రజలపై భారం పడకుండా మూత్రపిండాలు, గుండె, కాలేయం, రుమటాలజీ విభాగాల్లో వైద్య సేవలు మరింత మెరుగుపర్చాలని స్పష్టం చేశారు. నిమ్స్కు వచ్చిన ప్రతి రోగికి చికిత్స అందించాలని మంత్రి ఈటల ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన రోగులను గంటల కొద్ది వేచి చూసే పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
ఇవి కూడా చదవండి..
Vaccine Dry Run : తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్..అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు Sankranti Holidays : విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్..జనవరి 11 నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు