రాజధానిపై త్వరలోనే జగన్ ప్రకటన..!

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మెలికపెడితే, టీడీపీ నేతలు ఛలో అమరావతి అంటూ తమ ప్రోగ్రెస్‌ రిపోర్టును చూపించారు. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అని, నిర్మాణాలు లేవని ఆరోపణలు చేస్తున్న అధికారపక్షానికి కౌంటర్‌ ఇచ్చారు. తమతోపాటు వస్తే అమరావతిని చూపిస్తామనీ ఛాలెంజ్‌ చేస్తున్నారు. అసలు అమరావతి ఎక్కడ ఉందంటూ వైసీపీ కౌంటర్‌ ఇస్తోంది. అమరావతిపై ప్రశ్నలు సంధిస్తున్న టీడీపీ నేతలను వైసీపీ చెడ్డీగ్యాంగ్‌ అంటూ పోల్చుతోంది. రాజధానిపై వైసీపీ వర్సెస్‌ టీడీపీ, జనసేన మధ్య […]

రాజధానిపై త్వరలోనే జగన్ ప్రకటన..!
Follow us

|

Updated on: Nov 06, 2019 | 9:57 PM

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మెలికపెడితే, టీడీపీ నేతలు ఛలో అమరావతి అంటూ తమ ప్రోగ్రెస్‌ రిపోర్టును చూపించారు. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అని, నిర్మాణాలు లేవని ఆరోపణలు చేస్తున్న అధికారపక్షానికి కౌంటర్‌ ఇచ్చారు. తమతోపాటు వస్తే అమరావతిని చూపిస్తామనీ ఛాలెంజ్‌ చేస్తున్నారు. అసలు అమరావతి ఎక్కడ ఉందంటూ వైసీపీ కౌంటర్‌ ఇస్తోంది. అమరావతిపై ప్రశ్నలు సంధిస్తున్న టీడీపీ నేతలను వైసీపీ చెడ్డీగ్యాంగ్‌ అంటూ పోల్చుతోంది. రాజధానిపై వైసీపీ వర్సెస్‌ టీడీపీ, జనసేన మధ్య సాగుతున్న పంచాయితీ ఇప్పుడు తారాస్థాయికి చేరింది. దీనిపై టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ వేదికగా చర్చ జరిగింది.

ఈ తరుణంలో డిబేట్‌కు ఫోన్ కాల్ ద్వారా అందుబాటులోకి వచ్చిన ఏపీ మున్సిపల్ మినిస్టర్ బొత్స సత్యనారాయణ రాజధాని గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు. ప్రస్తుతం నిపుణుల కమిటీ రాష్ట్రమంతా పర్యటిస్తూ.. ప్రజల దగ్గర నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారన్నారు.  పర్యటన అనంతరం రాజధాని ఏ ప్రాంతంలో ఉండాలో అనే దానిపై నిపుణులు కమిటీ సమగ్రమైన నివేదిక ఇచ్చిన తర్వాత ప్రభుత్వం నిర్ణయాన్ని వెల్లడిస్తుందన్నారు. అంతేకాకుండా త్వరలోనే రాజధానిపై సీఎం జగన్ ప్రకటన విడుదల చేయనున్నారని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. రాజధానిపై గెజిట్ నోటిఫికేషన్, మరిన్ని విషయాలపై ఆయన మాటల్లోనే…

Latest Articles