కేరళలో కొత్తగా 1,310 కరోనా కేసులు
దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో కేరళ రాష్ట్రంలో నిత్యం వెయ్యికిపైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో
Coronavirus In Kerala: దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో కేరళ రాష్ట్రంలో నిత్యం వెయ్యికిపైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఆ రాష్ట్రంలో 1,310 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇప్పటివరకు 23 వేలకుపైగా నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి ఇప్పటివరకు 13,027 మంది చికిత్సకు కోలుకోగా.. 10,495 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. తీవ్రమైన ఇన్ఫెక్షన్ల కారణంగా 70 మంది మృత్యువాత పడ్డారని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
Read More:
నర్సులకు భారీ ఆఫర్లు.. విమానచార్జీలు.. 50 వేల జీతం..!
ఇంటర్ సెకండియర్ విద్యార్థులందరూ పాస్.. అందుబాటులో మెమోలు..!