కిలో చికెన్‌ కొంటే..అరకిలో ఉల్లి ఫ్రీ

ఉల్లి ధరలకు రెక్కలు రావడంతో ఏపీ ప్రభుత్వం రాయితీతో రైతుబజారులలో కెజీ ఉల్లి రూ.25కు సరఫరా చేస్తున్నది.. ఉల్లి లేనిదే ఏ కూర వండే పరిస్థితి లేకపోవడంతో ప్రజలు గంటల కొద్ది క్యూ లో ఉండి కిలో ఉల్లిని కొనుగోలు చేస్తున్నారు. ప్రజలు పడుతున్న ఉల్లి పాట్లను చూసిన ఓ వ్యాపారి వినూత్న ఆలోచన చేశాడు. స్వలాభంతో పాటుగా..ప్రజలకు ఉల్లిని ఉచితంగా అందించాలని నిర్ణయించుకున్నాడు. ఫ్రీగా అంటూ ఆశ్చర్యపోకండి..ఇక్కడో మతలబు ఉంది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా […]

కిలో చికెన్‌ కొంటే..అరకిలో ఉల్లి ఫ్రీ
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 12, 2019 | 1:29 PM

ఉల్లి ధరలకు రెక్కలు రావడంతో ఏపీ ప్రభుత్వం రాయితీతో రైతుబజారులలో కెజీ ఉల్లి రూ.25కు సరఫరా చేస్తున్నది.. ఉల్లి లేనిదే ఏ కూర వండే పరిస్థితి లేకపోవడంతో ప్రజలు గంటల కొద్ది క్యూ లో ఉండి కిలో ఉల్లిని కొనుగోలు చేస్తున్నారు. ప్రజలు పడుతున్న ఉల్లి పాట్లను చూసిన ఓ వ్యాపారి వినూత్న ఆలోచన చేశాడు. స్వలాభంతో పాటుగా..ప్రజలకు ఉల్లిని ఉచితంగా అందించాలని నిర్ణయించుకున్నాడు. ఫ్రీగా అంటూ ఆశ్చర్యపోకండి..ఇక్కడో మతలబు ఉంది.
వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన చిలుకూరి సత్యనారాయణ అనే వ్యాపారి కొత్తగా చికెన్‌ వ్యాపారం ప్రారంభించాడు. వినియోగదారులను ఆకర్షించేందుకు గానూ సరికొత్త ఆఫర్‌ ప్రకటించాడు. కిలో చికెన్‌ కొన్నవారికి అరకిలో ఉల్లిని ఉచితంగా అందజేస్తామని ప్రకటించాడు. ఈ మేరకు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయించాడు. ఇంకేముంది ప్రజలు దుకాణం ముందు క్యూ కట్టారు. మొదటి రోజు రెండువందల మందికి పైగా వినియోగదారులు రెండు వందలకు పైగా చికెన్‌ కొనుగోలు చేయగా, వారికి వంద కిలోల ఉల్లిని ఉచితంగా ఇచ్చాడు. వాస్తవానికి ప్రారంభించిన ఒక్క రోజు మాత్రమే ఈ ఆఫర్‌ ఇస్తామని ప్రకటించిన యాజమాన్యం ప్రజల తాకిడి చూసి మరో మూడు రోజుల పాటు ఉల్లి ఆఫర్‌ పొడిగించాడు. దీంతో స్థానికులతో పాటుగా చుట్టుపక్కల గ్రామస్తులు సైతం సత్యనారాయణ చికెన్ సెంటర్‌కు బారులు తీరారు. కొండేక్కిన ఉల్లిని ఇలా చికెన్‌తో ముడిపెట్టి వ్యాపారి ఆలోచనతో చూసినవారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.