Farmers Protest: క్రైం బ్రాంచ్‌కు ఢిల్లీ హింసాకాండ కేసు.. రైతు సంఘాల ప్రధాన నాయకులపై అభియోగాలు

కొత్త వ్యవసాయ చ‌ట్టాల‌ను నిరసిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీ హింసాత్మకంగా మారింది. పోలీసులు ముందస్తుగా పటిష్ట చర్యలు తీసుకున్నప్పటికీ..,

Farmers Protest: క్రైం బ్రాంచ్‌కు ఢిల్లీ హింసాకాండ కేసు.. రైతు సంఘాల ప్రధాన నాయకులపై అభియోగాలు
Follow us

|

Updated on: Jan 27, 2021 | 4:45 PM

Farmers Protest Updates: కొత్త వ్యవసాయ చ‌ట్టాల‌ను నిరసిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీ హింసాత్మకంగా మారింది. పోలీసులు ముందస్తుగా పటిష్ట చర్యలు తీసుకున్నప్పటికీ హింస చెలరేగడంపై కేంద్ర హోం శాఖ సీరియస్‌ అయింది. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. కాగా ఈ ఘటనలో ఓ రైతు మరణించగా.. 300 మంది పోలీసులు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి 22కేసులు నమోదు చేయడంతోపాటు 200 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనల దర్యాప్తును క్రైం బ్రాంచ్‌ పోలీసులకు అప్పగించారు. హత్యాయత్నం, దోపిడీ తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లలో ప్రధాన రైతుసంఘాల నాయకుల పేర్లను సైతం నమోదు చేశారు. ఆరుగురు రైతు నాయకులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రాకేశ్ తికాయట్, దర్శన్ పాల్, రాజిందర్ సింగ్, బల్బీర్ సింగ్ రాజేవాల్, బుటాసింగ్ బుర్జ్‌గిల్, జోగిందర్ సింగ్‌ సహా పలువురు నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాక్టర్ ర్యాలీకు ముందు జరిగిన ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు నాయకులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా.. అంతకుముందు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నివాసంలో ఢిల్లీ నిన్న జరిగిన పరిస్థితులపై ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ హింసలో ఎవరి ప్రమేయమున్న వదిలిపెట్టవద్దంటూ కేంద్రం పోలీసులకు సూచించినట్లు సమాచారం. Read More: రైతుల ఆందోళనపై సుప్రీం కోర్టులో కొనసాగుతున్న విచారణ.. క‌మిటీ ఏర్పాటు చేస్తామ‌న్న ధ‌ర్మాస‌నం. Read More:కేంద్రానికి రైతుల నిరసన సెగ… ఆందోళనలు విరమించి చర్చలకు రావాలంటూ విజ్ఞప్తి చేసిన కేంద్ర మంత్రి..

Latest Articles
టీడీపీలో జూనియర్‌ ఎన్టీఆర్‌ను తొక్కేస్తున్నారుః కొడాలి నాని
టీడీపీలో జూనియర్‌ ఎన్టీఆర్‌ను తొక్కేస్తున్నారుః కొడాలి నాని
పవర్ ప్లేలో ఆర్‌సీబీ బౌలర్ల భీభత్సం.. చెత్త రికార్డ్‌లో గుజరాత్
పవర్ ప్లేలో ఆర్‌సీబీ బౌలర్ల భీభత్సం.. చెత్త రికార్డ్‌లో గుజరాత్
కొడుకు నంబర్‌ హ్యాక్‌.. తల్లికి ఫోన్‌.. 12 లక్షలు గోవిందా..
కొడుకు నంబర్‌ హ్యాక్‌.. తల్లికి ఫోన్‌.. 12 లక్షలు గోవిందా..
ఇండస్ట్రీని షేక్ చేసిన రియల్ స్టోరీ.. నటి తల నరికి దారుణ హత్య..
ఇండస్ట్రీని షేక్ చేసిన రియల్ స్టోరీ.. నటి తల నరికి దారుణ హత్య..
ఐపీఎల్‌ 2024 లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని స్టార్ ప్లేయర్లు వీరే
ఐపీఎల్‌ 2024 లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని స్టార్ ప్లేయర్లు వీరే
గత ఓటమికి ప్రతీకారం తీర్చుకునేనా.. పంజాబ్‌తో పోరుకు చెన్నై రెడీ..
గత ఓటమికి ప్రతీకారం తీర్చుకునేనా.. పంజాబ్‌తో పోరుకు చెన్నై రెడీ..
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్..!
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్..!
ఆ ఇద్దరూ నన్ను మోసం చేశారు..షాహిద్ కపూర్..
ఆ ఇద్దరూ నన్ను మోసం చేశారు..షాహిద్ కపూర్..
రోజుకు రూ.250 పెట్టుబడితో ఏకంగా రూ.24 లక్షల రాబడి
రోజుకు రూ.250 పెట్టుబడితో ఏకంగా రూ.24 లక్షల రాబడి
పాము కాటుతో చనిపోయిన వ్యక్తిని గంగా నదిలో వేలాడదీసిన గ్రామస్తులు
పాము కాటుతో చనిపోయిన వ్యక్తిని గంగా నదిలో వేలాడదీసిన గ్రామస్తులు