సెంటిమెంట్ రిపీట్..మరోసారి ఎర్రటి వస్త్రంలోనే బడ్జెట్ ప్రతులు
తెలుగింటి కోడలు, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రెండోసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఆర్థికలోటు, నిరుద్యోగం వంటి సమస్యలు దేశాన్ని పట్టి పీడిస్తోన్న వేళ.. నిర్మలా సీతారామన్ 2020-21 గానూ ఎటువంటి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలు బడ్జెట్ తమకు అనుకూలంగా ఉంటుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పోయిన ఏడాది సాంప్రదాయంగా వస్తోన్న సూట్కేస్ పక్కనపెట్టి.. ఎర్రటి వస్త్రంలో బడ్జెట్ ప్రతులను తీసుకొచ్చారు నిర్మలా. ఈసారి కూడా […]
తెలుగింటి కోడలు, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రెండోసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఆర్థికలోటు, నిరుద్యోగం వంటి సమస్యలు దేశాన్ని పట్టి పీడిస్తోన్న వేళ.. నిర్మలా సీతారామన్ 2020-21 గానూ ఎటువంటి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలు బడ్జెట్ తమకు అనుకూలంగా ఉంటుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పోయిన ఏడాది సాంప్రదాయంగా వస్తోన్న సూట్కేస్ పక్కనపెట్టి.. ఎర్రటి వస్త్రంలో బడ్జెట్ ప్రతులను తీసుకొచ్చారు నిర్మలా. ఈసారి కూడా ఆమె అదే సంప్రదాయాన్ని కొనసాగించారు. ఆర్థిక శాఖ కార్యాలయంలో నిపుణలు, ఆర్దిక రంగ మేధావులతో కలిసి ముందస్తు కసరత్తు చేపట్టిన నిర్మలా.. తమ టీంతో కలిసి ఎర్రటి వస్త్రంలో బడ్జెట్ ప్రతులను పట్టుకుని వెళ్లి రాష్ట్రపతిని కలిశారు. అక్కడి నుంచి పార్లమెంట్కు బయలుదేరారు. నేడు ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ .