రైతులను తప్పుదోవ పట్టిస్తున్న దళారులు.. పట్టభద్రుల ఎన్నికల్లో గెలవడానికే ఉద్యోగాల పేరుతో నాటకాలు..

టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరేళ్ల పాలనలో ఉద్యోగుల పరిస్థితి అధ్వానంగా తయారైందని ఆరోపించారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు

రైతులను తప్పుదోవ పట్టిస్తున్న దళారులు.. పట్టభద్రుల ఎన్నికల్లో గెలవడానికే ఉద్యోగాల పేరుతో నాటకాలు..
Follow us

|

Updated on: Dec 18, 2020 | 5:47 AM

టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరేళ్ల పాలనలో ఉద్యోగుల పరిస్థితి అధ్వానంగా తయారైందని ఆరోపించారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ నూతన చట్టాలపై కొంతమంది దళారులు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ చట్టాలతో రైతులకు మంచి జరుగుతుంటే వారికి ఉన్నవి లేనివి చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మద్దతు ధర పెంచింది మోదీ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. టీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీలు దేశ అభివ‌ృద్ధికి అడ్డుపడుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిని బీజేపీ తీవ్రగా ఖండిస్తోందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఓయూ విద్యార్థిపై టీఆర్ఎస్ నేతలు దాడికి పాల్పడ్డారని విమర్శించారు. పట్టభద్రుల, కార్పొరేషన్ ఎన్నికల్లో గెలవడానికే టీఆర్ఎస్ ఉద్యోగాల పేరుతో నాటకాలు ఆడుతుందన్నారు. దివంగత నేత పీవీ నర్సింహరావు ఆర్థిక సంస్కరణలు చేపడితే కమ్యూనిస్టులు అడ్డుకునేందుకు ప్రయత్నించారని కానీ ఆయన చేసిన సంస్కరణల వల్లే ఇవాళ దేశం ఐదో అభివృద్ధి చెందిన దేశంగా ఉందని గుర్తుచేశారు.