మహిళల టీ20 ఛాలెంజ్‌కు స్పాన్సర్​గా జియో

భారతదేశంలో మహిళల క్రికెట్​కు తమ మద్దతు ఉంటుందని రిలయన్స్​ ఫౌండేషన్​ వ్యవస్థాపకురాలు, ఛైర్​పర్సన్​ నీతా అంబానీ ప్రకటించారు.  ఇందులో భాగంగా వచ్చే ఏడాది జరగనున్న మహిళల టీ20 ఛాలెంజ్​కు జియో, రిలయన్స్​ ఫౌండేషన్​, ఎడ్యుకేషన్​ అండ్​ స్పోర్ట్స్​ ఫర్​ ఆల్ స్పాన్సర్​గా ఉంటుందని తెలిపారు...

మహిళల టీ20 ఛాలెంజ్‌కు స్పాన్సర్​గా జియో
Follow us

|

Updated on: Nov 01, 2020 | 10:53 PM

BCCI Announce : దుబాయ్ వేదికగా జరుగనున్న మహిళల టీ 20 ఛాంపియన్స్ లీగ్‌కు స్పన్సర్స్ దొరికారు. ఈ వివరాలను బీసీసీఐ  వెల్లడించింది. భారతదేశంలో మహిళల క్రికెట్​కు తమ మద్దతు ఉంటుందని రిలయన్స్​ ఫౌండేషన్​ వ్యవస్థాపకురాలు, ఛైర్​పర్సన్​ నీతా అంబానీ ప్రకటించారు.  ఇందులో భాగంగా వచ్చే ఏడాది జరగనున్న మహిళల టీ20 ఛాలెంజ్​కు జియో, రిలయన్స్​ ఫౌండేషన్​, ఎడ్యుకేషన్​ అండ్​ స్పోర్ట్స్​ ఫర్​ ఆల్ స్పాన్సర్​గా ఉంటుందని తెలిపారు.

“మహిళల టీ20 ఛాలెంజ్​ను నిర్వహిస్తున్నందుకు బీసీసీఐకి నా హృదయపూర్వక అభినందనలు. భారత్​లో మహిళల క్రికెట్​ అభివృద్ధికి ఇదో ముందడుగు. ఈ అద్భుతమైన కార్యక్రమానికి మా పూర్తి సహకారాన్ని అందించడం ఆనందంగా ఉంది. క్రీడాకారులందరి సామర్థ్యాలపై నాకు అపారమైన నమ్మకం ఉంది. రెండేళ్లుగా ఐసీసీ ఈవెంట్లలో భారత మహిళా క్రికెటర్లు సాధించిన అద్భుత విజయాలతో దేశాన్ని గర్వించే విధంగా చేశారు. ఇలాంటి ప్రతిభ ఉన్న మహిళా క్రికెటర్లకు మౌలిక సదుపాయాలు, శిక్షణ, పునరావాస సౌకర్యాలను అందేలా చూడటం మా లక్ష్యం. అంజుమ్​, మిథాలీ, స్మృతి మంధాన, హర్మన్​ప్రీత్​, పూనమ్​ యాదవ్​ గొప్ప రోల్​మోడల్స్​. టీమ్​ఇండియాలోని ప్రతి మహిళా క్రికెటర్​ గొప్ప విజయాన్ని, కీర్తిని సంపాందించాలని కోరుకుంటున్నా.”

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ (ఐపీఎల్​)లో భాగంగా ఉమెన్స్​ టీ20 ఛాలెంజ్​ను భారత క్రికెట్​ నియంత్రణ మండలి నిర్వహిస్తోంది. యూఏఈలోని షార్జా వేదికగా సూపర్​ నోవాస్​, ట్రయల్​ బ్లేజర్స్​, వెలాసిటీ అనే మూడు టీమ్​లు తలపడనున్నాయి. ఈ జట్లకు హర్మన్​ప్రీత్​ కౌర్​,స్మృతి మంధాన, మిథాలీ రాజ్​లు కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. నవంబరు 4 నుంచి మహిళల టీ20 ఛాలెంజ్​ ప్రారంభం కానుంది.​ నవంబర్ 4, 5, 7 మరియు 9 తేదీల్లో షార్జాలో మ్యాచ్‌లు జరుగుతాయి. భారత్‌తో పాటు ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ దేశాల మహిళా క్రికెటర్లు ఇందులో పాల్గొంటారు.