అసెంబ్లీ ఫర్నీచర్ స్వాధీనం

ఏపీ మాజీ స్పీకర్ కోడెల తరలించిన అసెంబ్లీ ఫర్నీచర్‌ను స్వాధీనం చేసుకుంటున్నారు అధికారులు. ఇప్పటికే గుంటూరులోని కోడెల కుమారుడికి చెందిన గౌతమ్‌ హీరో షోరూంలో అసెంబ్లీ అధికారులు మూడురోజుల క్రితం జరిపిన తనిఖీల్లో ఫర్నిచర్‌ను గుర్తించారు. దీంతో సోమవారం అసెంబ్లీ, రెవెన్యూ, పోలీసు అధికారుల బృందం షోరూంకు వచ్చి ఫర్నిచర్‌ను అసెంబ్లీకి తరలించారు. ఇదిలా ఉంటే కోడెల చెప్పినదానికంటే ఎక్కువ ఫర్నీచర్ తరలించినట్టు తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు […]

అసెంబ్లీ ఫర్నీచర్ స్వాధీనం
Follow us

| Edited By: Srinu

Updated on: Aug 27, 2019 | 1:46 PM

ఏపీ మాజీ స్పీకర్ కోడెల తరలించిన అసెంబ్లీ ఫర్నీచర్‌ను స్వాధీనం చేసుకుంటున్నారు అధికారులు. ఇప్పటికే గుంటూరులోని కోడెల కుమారుడికి చెందిన గౌతమ్‌ హీరో షోరూంలో అసెంబ్లీ అధికారులు మూడురోజుల క్రితం జరిపిన తనిఖీల్లో ఫర్నిచర్‌ను గుర్తించారు. దీంతో సోమవారం అసెంబ్లీ, రెవెన్యూ, పోలీసు అధికారుల బృందం షోరూంకు వచ్చి ఫర్నిచర్‌ను అసెంబ్లీకి తరలించారు. ఇదిలా ఉంటే కోడెల చెప్పినదానికంటే ఎక్కువ ఫర్నీచర్ తరలించినట్టు తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు అసెంబ్లీ అధికారులు తనిఖీలు చేపట్టారని దానిప్రకారం కేసు దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ వివరించారు.