కాందహార్లో మరోసారి ఎయిర్స్ట్రైక్.. 10 మంది తాలిబన్లు హతం..
ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లకు, ఆఫ్ఘన్ ప్రభుత్వానికి మధ్య మళ్లీ వార్ మొదలైంది. నిత్యం ఆఫ్ఘన్ సైన్యం లక్ష్యంగా తాలిబన్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఆఫ్ఘన్ సైన్యం..
ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లకు, ఆఫ్ఘన్ ప్రభుత్వానికి మధ్య మళ్లీ వార్ మొదలైంది. నిత్యం ఆఫ్ఘన్ సైన్యం లక్ష్యంగా తాలిబన్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఆఫ్ఘన్ సైన్యం, నాటో దళాలు.. తాలిబన్ ఉగ్రవాదులు లక్ష్యంగా ఎయిర్ స్ట్రైక్ చేపడుతున్నారు. ఈ క్రమంలో పదుల సంఖ్యలో తాలిబన్ ఉగ్రవాదులు హతమవుతున్నారు. తాజాగా బుధవారం కాందహార్ ప్రాంతంలో ఫారిన్ ఫోర్స్ ఎయిర్ స్ట్రైక్ చేపట్టింది. ఈ ఘటనలో పది మంది తాలిబన్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ఘటన కాక్రీజ్ జిల్లా ప్రావిన్స్లో చోటుచేసుకుందన్నారు. ఇదిలావుంటే.. ఆఫ్ఘన్ నాటో దళాలు అంతుకుముందు జరిపిన ఎయిర్ స్ట్రైక్లో 25 మంది తాలిబన్లు హతమయ్యారు. వీరిలో పన్నెండు మంది పాకిస్థానీయులు కూడా ఉన్నారు.