కొత్తగూడెం డీఎస్పీపై కరోనా కొరడా..

కరోనా వైరస్ ప్రస్తుతం దేశంలో ఎలా వ్యాప్తిచెందుతుందో అందరికీ తెలిసిందే. రోజురోజుకు పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో ఎంతో బాధ్యతగా డ్యూటీ చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. సమాజానికి కీడు చేస్తున్నారు. కొ్త్తగూడెం డీఎస్పీ వ్యవహారంపై అధికారులు కేసు నమోదు చేశారు. విదేశాల నుంచి వచ్చిన తన కుమారుడిని.. క్వారైంటన్‌లో పెట్టాల్సిన డీఎస్పీ.. అలా చేయకుండా వెంట తీసుకెళ్లాడు. అంతేకాదు.. ఇంట్లో ఒకే […]

కొత్తగూడెం డీఎస్పీపై కరోనా కొరడా..
Follow us

| Edited By:

Updated on: Mar 25, 2020 | 3:54 PM

కరోనా వైరస్ ప్రస్తుతం దేశంలో ఎలా వ్యాప్తిచెందుతుందో అందరికీ తెలిసిందే. రోజురోజుకు పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో ఎంతో బాధ్యతగా డ్యూటీ చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. సమాజానికి కీడు చేస్తున్నారు. కొ్త్తగూడెం డీఎస్పీ వ్యవహారంపై అధికారులు కేసు నమోదు చేశారు. విదేశాల నుంచి వచ్చిన తన కుమారుడిని.. క్వారైంటన్‌లో పెట్టాల్సిన డీఎస్పీ.. అలా చేయకుండా వెంట తీసుకెళ్లాడు. అంతేకాదు.. ఇంట్లో ఒకే దగ్గర పెట్టకుండా.. విచ్చలవిడిగా.. ఎక్కడ పడితే అక్కడ తిరిగాడు అతడి కుమారుడఉ. అయితే అనంతరం విదేశాల నుంచి వచ్చిన అతడి కుమారుడిని పరీక్షించగా.. అతడికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో కుమారుడిని తీసుకెళ్లిన డీఎస్పీపై 1897 అంటువ్యాధుల నిర్మూ‍లన చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే డీఎస్పీ కుమారుడికి కరోనా పాజిటివ్ నిర్థారణ కావడంతో.. కొత్తగూడెం పోలీసు యంత్రాంగంలో కలవరం మొదలైంది. డీఎస్పీతో సహా అతని కుంటుంబాన్ని వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు వరంగల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతడు తన కుమారుడు వచ్చినప్పటి నుంచి ఎక్కడెక్కడ తిరిగాడో దానికి సంబంధించిన వివరాలు చూడండి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం డీఎస్పీ అలీ వివరాలు..

18:03:2020 *సాయంత్రం పశ్చిమ గోదావరి చింతలపూడి కి కుటుంబ సమేతంగా గృహ ప్రవేశానికి హాజరు

19.03.2020 డిఎస్పి కార్యాలయం లో ఎస్సైలు సీఐలు కలిసి అతను కాఫీలు తాగడం జరిగింది..

20.03.2020 * భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కరోనా వైరస్ గురించి విసిలో డీఎస్పీ విధుల నిర్వహణ

21.3.2020 డి.ఎస్.పి కుమారుడు కరోనా లక్షణాలు కనిపించడంతో ప్రభుత్వ ఆస్పత్రి కి తీసుకెళ్లి తదుపరి పరీక్షల నిమిత్తం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి పంపించడం జరిగింది. డీఎస్పీ అలీ ఇంటి వద్ద కార్యాలయంలో కొంతమంది అధికారులు కలిసినట్లు సమాచారం

21.03.2020 సాయంత్రం అలీ,భార్య,హౌస్ కుక్స్ 2 ఎర్రగడ్డ హస్పటల్ కు తరలింపు..

పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడితో పాటు.. కొత్తగూడెంలోని వన్ టౌన్ పరిధిలో డీఎస్పీ అలీపై కేసులు నమోదు