ఖైరతాబాద్ గణేషుడు.. ఈసారి ఇలా
నవరాత్రి వేడుకలకు ప్రముఖ ఖైరతాబాద్ వినాయకుడు సిద్ధమయ్యారు. కరోనా నేపథ్యంలో ఈ సారి 9 అడుగులకే పరిమితం కాగా
Khairatabad Ganesh Statue: నవరాత్రి వేడుకలకు ప్రముఖ ఖైరతాబాద్ వినాయకుడు సిద్ధమయ్యారు. కరోనా నేపథ్యంలో ఈ సారి 9 అడుగులకే పరిమితం కాగా.. ఈసారి దేవతల వైద్యుడైన ధన్వంతరి అవతారంలో ఆయన దర్శనం ఇవ్వనున్నారు. ఒక చేతిలో అమృతం, మరో చేతిలో ఆయుర్వేదంతో ఆయన కనిపిస్తారు. అలాగే ఓవైపు లక్ష్మీ దేవి, మరోవైపు సరస్వతి దేవీల విగ్రహాలను ఏర్పాటు చేశారు. కరోనాకు వ్యాక్సిన్ త్వరగా రావాలని ఈ సంవత్సరం ధన్వంతరి వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. ఇక కరోనా నేపథ్యంలో భక్తులకు అనుమతి లేదని.. హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయబోమని.. ఉన్న చోటే ద్రవాలతో అభిషేకం చేసి నిమజ్జనం చేస్తామని వారు వివరించారు.
ఇక స్వామి వారిని ఆన్లైన్లో దర్శించుకునేందుకు, పూజలు నిర్వహించేందు వీలును కల్పిస్తున్నారు. ఇందుకోసం www.ganapathideva.org అనే వెబ్సైట్ని రూపొందించారు. అందులోకి వెళ్లి రిక్వెస్ట్ ఫర్ పూజా అనే ఆప్షన్ను క్లిక్ చేసి పేరు, గోత్రం, మొబైల్ నంబరు, ఈ మెయిల్, చిరునామా ఎంటర్ చేసి, సబ్మిట్ అని నొక్కితే నేరుగా సైట్ నిర్వాహకుల ద్వారా స్వామి వారి వద్ద అర్చకులు పూజలు నిర్వహించనున్నారు.
Read More: