సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ఆపిల్ పండ్లను అందించిన రైతు

తెలంగాణలో తొలిసారి ఆపిల్ పంట పండించిన కెరమెరి రైతు బాలాజీ సీఎం కేసీఆర్‌ను కలిశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాను పండించిన ఆపిల్ పండ్లను సీఎంకు అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాలాజీని అభినందించారు. ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం ధనోరా గ్రామంలో రెండు ఎకరాల్లో హెచ్‌ఆర్ 99 రకం ఆపిల్ పంటను పండించినట్లు కేసీఆర్‌కు వివరించారు. తెలంగాణ ఉద్యానవన శాఖ ఎనలేని సహకారాన్ని అందించిందని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ప్రోత్సాహంతోనే ఆపిల్ […]

సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ఆపిల్ పండ్లను అందించిన రైతు
Follow us

|

Updated on: Jun 02, 2020 | 4:22 PM

తెలంగాణలో తొలిసారి ఆపిల్ పంట పండించిన కెరమెరి రైతు బాలాజీ సీఎం కేసీఆర్‌ను కలిశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాను పండించిన ఆపిల్ పండ్లను సీఎంకు అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాలాజీని అభినందించారు. ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం ధనోరా గ్రామంలో రెండు ఎకరాల్లో హెచ్‌ఆర్ 99 రకం ఆపిల్ పంటను పండించినట్లు కేసీఆర్‌కు వివరించారు. తెలంగాణ ఉద్యానవన శాఖ ఎనలేని సహకారాన్ని అందించిందని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ప్రోత్సాహంతోనే ఆపిల్ పంటను సాగు చేసినట్లుగా తెలిపారు. తెలంగాణ నేలలు విభిన్న రకాల స్వభావం కలిగినవని చెప్పడానికి ఇదే పెద్ద ఉదాహరణ అని అన్నారు. కెరమెరి రైతు బాలాజీ పండించిన ఆపిల్‌ పండ్లు మరికొద్ది రోజుల్లో మార్కెట్‌ల్లో అందుబాటులోకి రానున్నాయి.