Breaking : కేరళ బంగారం స్మగ్లింగ్ కేసు ప్రధాన నిందితురాలు స్వప్న అరెస్ట్..
కేరళలో బంగారం స్మగ్లింగ్ కేసు కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి సీఎం పినరయి విజయన్ లక్ష్యంగా ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి
కేరళలో బంగారం స్మగ్లింగ్ కేసు కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి సీఎం పినరయి విజయన్ లక్ష్యంగా ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. దీంతో బంగారం అక్రమ రవాణాపై నిష్పక్షిపాతంగా దర్యాప్తు జరిపించాల్సిందిగా బుధవారం ప్రధానికి లేఖ రాశారు. ఈ క్రమంలో కేసు విచారణను ఎన్ఐఏకు అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో శుక్రవారం రంగంలోకి దిగిన 24 గంటల్లోనే ప్రధాన నిందితురాలు స్వప్నా సురేశ్, మరో నిందితుడు సందీప్ నాయర్లను అరెస్టు అరెస్ట్ చేశారు ఎన్ఐఏ అధికారులు. బంగారం అక్రమ రవాణా అంశాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. జాతీయ భద్రతకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని భావించింది. అందుకే కేసు విచారణను వేగవతం చేసింది.