Mahesh27: సూపర్‌స్టార్ వర్సెస్ సూపర్‌స్టార్..!

'గీత గోవిందం' ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించబోతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్న

Mahesh27: సూపర్‌స్టార్ వర్సెస్ సూపర్‌స్టార్..!
Follow us

| Edited By:

Updated on: May 30, 2020 | 12:46 PM

‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించబోతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్న ఈ చిత్రానికి సర్కార్ వారి పాట అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతుండగా.. నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు దర్శకుడు పరశురామ్. అందులో భాగంగా ఈ మూవీలో విలన్ పాత్ర కోసం కన్నడ సూపర్‌స్టార్‌ ఉపేంద్రను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో విలన్ పాత్ర బలంగా ఉండనుందట. ఇక ఆ పాత్రకు ఉపేంద్రనే న్యాయం చేయగలడని పరశురామ్ భావిస్తున్నారట. ఈ విషయంలో మహేష్ కూడా ఓకే చెప్పారట. ఈ క్రమంలో త్వరలోనే పరశురామ్, ఉపేంద్రను సంప్రదించబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇందులో నటించేందుకు ఆయన ఒప్పుకుంటే.. ఈ మూవీకి మరింత క్రేజ్‌ యాడ్ అయ్యే అవకాశం ఉంది.

కాగా అల్లు అర్జున్ హీరోగా నటించిన సన్నాఫ్ సత్యమూర్తిలో ఉపేంద్ర విలన్ రోల్‌లో కనిపించారు. ఇప్పుడు వరుణ్‌ తేజ్‌ 10వ చిత్రంలోనూ కీలక పాత్రలో ఆయన కనిపించబోతున్నారు. సన్నాఫ్ సత్యమూర్తి తరువాత తనకు చాలా విలన్ పాత్రలు వచ్చాయని, కానీ అలాంటి పాత్రలే చేయాలని తాను అనుకోలేదని ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూలో ఉపేంద్ర చెప్పారు. ఈ క్రమంలోనే సరిలేరు నీకెవ్వరు ఆఫర్ కూడా వదులుకున్నట్లు అప్పట్లో టాక్ నడిచింది. మరి ఇప్పుడు మహేష్ సినిమా విషయంలో కన్నడ సూపర్‌స్టార్ ఏమంటారో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Read This Story Also: కరోనా మృతురాలి బ్యాగ్ తెరిచినందుకు.. 18 మందికి పాజిటివ్..!

Latest Articles