ఐపీఎల్ 2020: ఢిల్లీ వెర్సస్ ముంబై మ్యాచ్ ఫిక్స్ అయిందా.?

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో ఫిక్సింగ్ ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వాటికి ఊతం ఇస్తోంది తాజాగా జరిగిన ముంబై ఇండియన్స్ వెర్సస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్.

ఐపీఎల్ 2020: ఢిల్లీ వెర్సస్ ముంబై మ్యాచ్ ఫిక్స్ అయిందా.?
Follow us

|

Updated on: Oct 13, 2020 | 9:14 AM

IPL 2020: ఐపీఎల్ 2020 జోరు కొనసాగుతోంది. టోర్నీ ఆరంభం నుంచి ప్రతీ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. చివరి బాల్ వరకు ఉత్కంఠను కలిగిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో ఫిక్సింగ్ ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వాటికి ఊతం ఇస్తోంది తాజాగా జరిగిన ముంబై ఇండియన్స్ వెర్సస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్.

ఆ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేసిన ఫైనల్ స్కోర్‌ను ముందుగానే రివీల్ చేస్తూ ముంబై ఇండియన్స్ చేసిన ఓ ట్వీట్ చేసింది. కొద్దిసేపటికి ఆ ట్వీట్ డిలీట్ అయినా.. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మ్యాచ్ ఆరంభమైన తొలి ఓవర్‌లోనే ఢిల్లీ చేయబోయే స్కోర్‌ను ఇంచుమించుగా ముంబై ఇండియన్స్ చెప్పేసింది.

ఢిల్లీ 19.5 ఓవర్లకు 163/5 చేస్తుందంటూ ముంబై ఇండియన్స్ చేసిన ఓ ట్వీట్ నెట్టింట్లో పెద్ద చర్చకు దారి తీసింది. ఇది యాధృచ్చికమా లేక ఏదైనా విషయం ఉందా అనేది తెలియదు గానీ.. ఇప్పుడు నెటిజన్లలో ఇదే హాట్ టాపిక్. ముంబై ట్వీట్ చేసినట్లుగానే ఢిల్లీ 20 ఓవర్లకు 166/5 పరుగులు చేసింది.

ఆ ట్వీట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా.. ఆ మ్యాచ్ ఖచ్చితంగా ఫిక్స్ అయిందంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. ముందుగానే స్కోర్‌ను ఫిక్స్ చేసుకుని మరీ ఆడతారా అంటూ ముంబై ఇండియన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆ ట్వీట్‌ను మార్ఫింగ్ ఫోటో అని చెప్పిన వారు కూడా లేకపోలేదు.