ఈ సాయంత్రం దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై భారీ లైవ్ బ్యాండ్ ఈవెంట్

భాగ్యనగరం సిగలో మరో మణిహారంగా నిలిచిన దుర్గంచెరువు తీగల వంతెన పై ఈ(శనివారం) సాయంత్రం 5.30 గంటలకు భారీ స్థాయిలో కల్చరల్ ఈవెంట్ జరుగబోతోంది. ఆర్మీ సెరమోనియల్ సింఫోనీ బ్యాండ్ ఈ ప్రదర్శన ఇవ్వబోతుంది. ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో జరుగబోతోన్న ఈ ఈవెంట్ ను నార్తన్ బార్డర్ లో విధులు నిర్వహిస్తున్న భారతీయ సైనికులు, జి.హెచ్.యం.సి శానిటేషన్ కరోనా వారియర్ల సేవల నిర్వహణకు సంఘీభావాన్ని తెలియజేసేలా నిర్వహించతలపెట్టారు. ఈ లైవ్ బ్యాండ్ ప్రదర్శనకు ప్రజలందరు ఉత్సహంగా హాజరుకావాలని […]

ఈ సాయంత్రం దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై భారీ లైవ్ బ్యాండ్ ఈవెంట్
Follow us

|

Updated on: Sep 26, 2020 | 8:43 AM

భాగ్యనగరం సిగలో మరో మణిహారంగా నిలిచిన దుర్గంచెరువు తీగల వంతెన పై ఈ(శనివారం) సాయంత్రం 5.30 గంటలకు భారీ స్థాయిలో కల్చరల్ ఈవెంట్ జరుగబోతోంది. ఆర్మీ సెరమోనియల్ సింఫోనీ బ్యాండ్ ఈ ప్రదర్శన ఇవ్వబోతుంది. ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో జరుగబోతోన్న ఈ ఈవెంట్ ను నార్తన్ బార్డర్ లో విధులు నిర్వహిస్తున్న భారతీయ సైనికులు, జి.హెచ్.యం.సి శానిటేషన్ కరోనా వారియర్ల సేవల నిర్వహణకు సంఘీభావాన్ని తెలియజేసేలా నిర్వహించతలపెట్టారు. ఈ లైవ్ బ్యాండ్ ప్రదర్శనకు ప్రజలందరు ఉత్సహంగా హాజరుకావాలని నిర్వాహకులు కోరారు. 45 నిమిషాల పాటు ఈ ప్రదర్శన ఉంటుంది.

వందేమాతరంతో ప్రారంభించి పలు దేశ భక్తి, భారతీయ, పాశ్చాత్య గీతాల సంగీతాన్ని ప్రదర్శించి “జయ హో ” తో ముగిస్తారు. ఆర్మీ బ్యాండ్ ప్రదర్శన అనంతరం Ms.అనీశా సారధ్యంలో స్థానిక బ్యాండ్, ఇండియన్, వెస్ట్రన్ పాటలను ప్రజల వినోదం కోసం ప్రదర్శిస్తారని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ అర్వింద్ కుమార్ తెలిపారు. కాగా, ఈ వంతెనను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ శుక్రవారం ప్రారంభించిన సంగతి తెలిసిందే.